సెన్సెక్స్.. 28,463 నిఫ్టీ.. 8,610
ముంబై : ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన శుక్రవారం నాటి ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్ స్వల్పలాభాలతో గట్టెక్కింది. అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి ప్రధాన సంఘటనలు లేని కారణంగా ట్రేడింగ్ మందకొడిగా సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 17 పాయింట్ల లాభంతో 28,463 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్ల లాభంతో 8,610 పాయింట్ల వద్ద ముగిశాయి. వరుసగా 3వరోజూ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. టెక్నాలజీ, ఫార్మా, లోహ, కొన్ని వాహన షేర్లలో కొనుగోళ్ల జోరు కనిపించింది. సాధారణం కంటే 6 శాతం తక్కువగానే వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించడం కొంత ప్రతికూల ప్రభావం చూపింది.
వారంలో చూస్తే...
ఈ వారంలో సెన్సెక్స్ 802(2.89 శాతం) పాయింట్లు, నిఫ్టీ 249 (2.98 శాతం)పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. నెల రోజుల్లో ఇంత ఎక్కువగా లాభపడిన వారం ఇదే. నిలకడగా కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, ఫార్మా, వాహన షేర్ల పెరుగుదల... దీనికి ప్రధాన కారణాలని నిపుణులంటున్నారు. ఎఫ్డీఐ నిబంధనల సరళీకరణ, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉండడం వంటి కారణాల వల్ల సెన్సెక్స్ 28,576 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో 28,417 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 8,643-8,593 పాయింట్ల గరిష్ట. కనిష్ట స్థాయిల మధ్య కదలాడి, చివరకు స్వల్పంగా 2 పాయింట్ల లాభంతో ముగిసింది.
ప్రైవేట్ బ్యాంక్ షేర్లకు నష్టాలు..
అన్ని ఎఫ్డీఐలకు ఒకే పరిమితి అన్న విధానం నుంచి ప్రైవేట్ బ్యాంక్లను మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రైవేట్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు లాభాల్లో, 11 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,423 షేర్లు లాభాల్లో, 1,407 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,777 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.14,983 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,86,123 కోట్లుగా నమోదైంది.
హెచ్డీఎఫ్సీ: నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్సీడీ), వారంట్లతో సహా వివిధ మార్గాల్లో రూ.90,000 కోట్లు సమీకరించనున్నది. వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.
బ్యాంక్ షేర్లలో తగ్గిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
బ్యాంక్ షేర్లలో మ్యూచువల్ ఫండ్ సంస్థల పెట్టుబడులు తగ్గాయి. ఈ ఏడాది మేలో రూ. 79,215 కోట్లుగా ఉన్న ఎంఎఫ్ పెట్టుబడులు గత నెలలో రూ.78,582 కోట్లకు తగ్గాయని సెబీ వెల్లడించింది. లాభాల స్వీకరణ కారణంగా ఫండ్ మేనేజర్లు బ్యాంక్ షేర్లపై పెట్టుబడులు తగ్గించుకున్నారని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
లాభాలు... స్వల్పంగా
Published Sat, Jul 18 2015 1:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement