లాభాల ముగింపు | Sakshi
Sakshi News home page

లాభాల ముగింపు

Published Mon, Feb 12 2018 3:47 PM

Market closes higher as global equities see a bounce-back - Sakshi

సాక్షి,ముంబై:  అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో లాభాలతో బౌన్స్‌  బ్యాక్‌ అయిన దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. మివడ్‌ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు మరింత పెరగడంతో  మార్కెట్లు జోష్‌ పెంచిన సెన్సెక్స్‌ 330 పాయింట్లు లాభపడింది. అయితే చివరి గంటలో అమ్మకాలు కొనుగోళ్ల మధ్య   సెన్సెక్స్‌295 పాయింట్ల లాభంతో 34,300 వద్ద, నిఫ్టీ85 పాయింట్లు పుంజుకుని 10539వద్ద ముగిసింది. కీలక సూచీ నిఫ్టీ 10500కి ఎగువన స్థిరపడింది. ఫార్మా, రియల్టీ, ఆటో, మెటల్‌, ప్రయివేట్‌ బ్యాంక్స్ లాభపడగా, ఐటీ నష్టపోయింది.  అలాగే రియలన్స్‌ ఇన్‌ఫ్రా  సానుకూల వార్తలతో అడాగ్‌ షేర్లు లాభాలనార్జించాయి. టాటా స్టీల్‌, అరబిందో, యస్‌బ్యాంక్‌, లుపిన్‌, ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్‌, ఐబీ హౌసింగ్‌, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, మారుతీ  లాభాల్లోనూ,  ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, టెక్ మహీంద్రా స్వల్పలాభాల మధ్య ముగిశాయి.
 
 

Advertisement
Advertisement