సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా మొదలయ్యాయి. సెన్సెక్స్2 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 5 లాభంతో ట్రేడ్ అవుతోంది. అయితే స్వల్ప లాభనష్టాల మధ్య కొనసాగుతున్నప్పటికీ కీలక సూచీలు రెండూ మద్దతుస్థాయిలకుపైన కొనసాగుతుండటం విశేషం. అటుబ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ఉంది.
పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో, పీఎస్యూ కౌంటర్లకు కొనుగోళ్ళ మద్దతు లభిస్తోండగా... క్యాపిటల్ గూడ్స్, హెల్త్కేర్, కన్జ్యూమర్ గూడ్స్ సెక్టార్లో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. టాటాగ్రూపు షేర్ల లాభాలు రెండవరోజుకూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టాటా పవర్ టాటా పవర్, టాటా మోటార్స్ టాటా మోటార్స్, టీసీఎస్, టాటా మోటార్స్ డీవీఆర్లు లాభాల్లోఉన్నాయి.అలాగే ఎంఅండ్ఎం, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, అదాని ట్రాన్స్మిషన్ లాభంతో ట్రేడవుతున్నాయి. ఎల్అండ్టీ, సిప్లా, అరబిందో ఫార్మా, యెస్ బ్యాంక్, ఐటీసీలు నష్టాల్లో ట్రేడవుతోన్నాయి.