మారుతీ కార్ల ధరలు పెరిగాయ్... | Sakshi
Sakshi News home page

మారుతీ కార్ల ధరలు పెరిగాయ్...

Published Sat, Aug 22 2015 1:12 AM

మారుతీ కార్ల ధరలు పెరిగాయ్...

న్యూఢిల్లీ : దేశీ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తన కార్ల ధరలను దాదాపు రూ.9,000 వరకు పెంచింది. డీలర్ మార్జిన్‌లో స్వల్ప మార్పే ధరల పెరుగుదలకు కారణం. ఇటీవల కొత్తగా మార్కెట్‌లోకి తీసుకొచ్చిన ఎస్-క్రాస్ ధరను మాత్రం అలాగే ఉం చింది. పెరిగిన కార్ల ధరలు ఆగస్ట్ 11 నుంచి అమలులోకి వచ్చాయని మారుతీ సుజుకీ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం మారుతీ దేశీ కార్ల మార్కెట్ వాటా 45 శాతంగా ఉంది. కంపెనీ విక్రయించే కార్ల ధరలు రూ.2.25 లక్షల నుంచి రూ.13.74 లక్షల (ఢిల్లీ ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

Advertisement
Advertisement