ఫ్రాంక్ఫర్ట్ : మారుతీ సుజుకీ ఇండియా కంపెనీ ప్రీమియం హ్యాచ్బాక్ కేటగిరీలో కొత్త కారు మోడల్ను ఈ పండుగల సీజన్లో మార్కెట్లోకి తెస్తోంది. బాలెనో పేరుతో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈ కారును మారుతీ కంపెనీ అందించనున్నది. మారుతీ మాతృకంపెనీ సుజుకీ మోటార్ కార్ప్ ఈ కొత్త బాలెనో మోడల్ను ఇక్కడ జరుగుతున్న ఆటో షోలో ప్రదర్శించింది. ప్రీమియం కార్ల విక్రయాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నెక్సా అవుట్లెట్ల ద్వారా ఈ బాలెనో కార్లను విక్రయిస్తామని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ చెప్పారు. పెట్రోల్ వేరియంట్ను 1.2 లీటర్ ఇంజిన్తోనూ, డీజిల్ వేరియంట్ను 1.3 లీటర్ ఇంజిన్తోనూ అందిస్తామని తెలిపారు. ఫ్రాంక్ఫర్ట్ ఆటోషో గురువారం లాంఛనంగా ప్రారంభమై ఈ నెల 27వరకూ కొనసాగుతుంది. మంగళ, బుధవారాల్లో కేవలం మీడియాను మాత్రమే అనుమతిస్తారు. ఇతర వివరాలు..
రోల్స్ రాయిస్ నుంచి కొత్త డాన్..
ఇంగ్లాండ్కు చెందిన సూపర్ లగ్జరీ కార్ల కంపెనీ రోల్స్ రాయిస్ కొత్త ఓపెన్-టాప్ మోడల్ కారును ఈ ఆటో షోలో ప్రదర్శించింది. డాన్ పేరుతో అందిస్తున్న ఈ కారును వచ్చే ఏడాది జూలైకల్లా భారత మార్కెట్లోకి తెస్తామని రోల్స్-రాయిస్ మోటార్ కార్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టొరస్టన్ ముల్లర్ ఒట్వోస్ చెప్పారు. త్వరలో కొత్త కన్వర్టిబుల్ను. ఒక ఎస్యూవీని కూడా భారత మార్కెట్లోకి తేనున్నామని వివరించారు. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ కంపెనీ సొంతమైన రోల్స్-రాయిస్ భారత్లో రూ.4.6 కోట్ల నుంచి రూ.9 కోట్ల విలువైన లగ్జరీ కార్లను విక్రయిస్తోంది.
ఎస్యూవీ మార్కెట్లోకి టాటా జేఎల్ఆర్
టాటా మోటార్స్కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) సంస్థ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్ (ఎస్యూవీ) మార్కెట్లోకి ప్రవేశించింది. ఫ్రాంక్ఫర్ట్ ఆటో షోలో ఎఫ్-పేస్ ఎస్యూవీని ప్రదర్శించింది. ఈ ఎస్యూవీని వచ్చే ఏడాది మొదట్లో అమెరికా, యూరప్ల్లో, వచ్చే ఏడాది రెండో అర్థభాగంలో భారత మార్కెట్లోకి తెస్తామని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రోహిత్ సూరి చెప్పారు.
వచ్చే ఏడాది ఫోక్స్వ్యాగన్ కొత్త టైగువాన్ ఎస్యూవీ
జర్మనీకి చెందిన ఫోక్స్వ్యాగన్ కంపెనీ ఎస్యూవీ టైగువాన్లో కొత్త జనరేషన్ కారును వచ్చే ఏడాది భారత్లోకి అందుబాటులోకి తేనున్నది. గోల్ఫ్, పోలో కార్ల తర్వాత అంత్యంత పాపులర్ అయిన కారు ఇదేనని కంపెనీ సీఈఓ హెర్బర్ట్ డిఈస్ పేర్కొన్నారు.
మారుతీ కొత్త బాలెనో వస్తోంది..
Published Wed, Sep 16 2015 2:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement