పుణే: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్.. భారత లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘ఈక్యూ’ని మంగళవారం ఇక్కడ ప్రారంభించింది. నూతన బ్రాండ్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్లో ‘ఈక్యూసీ’ పేరిట తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత మార్కెట్లో విడుదలకానుందని సంస్థ ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ వెల్లడించారు. ఎలక్ట్రిక్కు సంబంధించిన అన్ని వాహనాలను ఇదే బ్రాండ్ నుంచి విడుదలచేయనున్నామని చెప్పారు.