మైక్రోసాఫ్ట్ లూమియా 430 ఫోన్ @ రూ.5,299 | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ లూమియా 430 ఫోన్ @ రూ.5,299

Published Sat, May 16 2015 11:31 AM

మైక్రోసాఫ్ట్ లూమియా 430 ఫోన్ @ రూ.5,299

ముంబై: మైక్రోసాఫ్ట్ సంస్థ లూమియా 430 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌ధర రూ.5,299 అని కంపెనీ పేర్కొంది. 4 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్ ఉన్న ఈ ఫోన్‌ను విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ డివెసైస్ డెరైక్టర్ (వెస్ట్) అనంత్ మిట్టల్ చెప్పారు. ఈ ఫోన్‌లో 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా వంటి ఫీచర్లున్నాయని వివరించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement