ముకేశ్ అంబానీకి ఐసీటీ డాక్టరేట్ | Sakshi
Sakshi News home page

ముకేశ్ అంబానీకి ఐసీటీ డాక్టరేట్

Published Thu, Feb 19 2015 1:42 AM

ముకేశ్ అంబానీకి ఐసీటీ డాక్టరేట్

న్యూఢిల్లీ: దేశీ వ్యాపార రంగానికి అందించిన సేవలకు గానూ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ముకేశ్ అంబానీకి ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ముకేశ్ అంబానీ ఐసీటీలోనే 1979లో కెమికల్ ఇంజనీరింగ్‌లో బీఈ పూర్తిచేశారు. ఈయనకు ముందు ఈ డాక్టరేట్‌ను భారతరత్న అవార్డు గ్రహీత, ప్రపంచ ప్రసిద్ధ శాస్త్రవేత్త డా.సీఎన్‌ఆర్ రావు, ప్రముఖ రసాయన శాస్త్రవేత్త ఎంఎం శర్మతో పాటు మరొక వ్యక్తి పొందారు.

Advertisement
Advertisement