యుడాసిటీ భాగస్వామ్యంతో ఆఫర్; వెయ్యి ఉచిత స్కాలర్షిప్లు
- కోర్సు కాలవ్యవధి 6-9 నెలలు
- నెలకు రూ. 9,800 వరకూ వ్యయం
బెంగళూరు: గూగుల్ సంస్థ భారత్లో ఆండ్రాయిడ్ నానోడిగ్రీలను ఆఫర్చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ యుడాసిటీ భాగస్వామ్యంతో ఈ డిగ్రీలను ఆఫర్ చేస్తున్నామని తెలిపింది. అంతర్జాతీయ, దేశీయ యాప్ల రూపకల్పన చేసే అత్యున్నత స్థాయి మొబైల్ డెవలపర్లను తయారు చేయడం లక్ష్యంగా ఈ డిగ్రీలను అందిస్తున్నామని గూగుల్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ(సౌత్ ఈస్ట్ ఏషియా, ఇండియా) రాజన్ ఆనందన్ చెప్పారు. భారత్లో ఇప్పటికే 30 లక్షల మంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారని, 2018 కల్లా ఈ విషయంలో అమెరికాను భారత్ అధిగమిస్తుందని పేర్కొన్నారు. అప్పటికల్లా భారత్లో సాఫ్ట్వేర్ నిపుణుల సంఖ్య నలభై లక్షలకు పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే టాప్ 1,000 ఆండ్రాయిడ్ యాప్లలో భారత డెవలపర్లు రూపొందించిన యాప్స్ కేవలం రెండు శాతమేనని తెలిపారు. సాఫ్ట్వేర్ నిపుణులు అధిక సంఖ్యలో ఉన్నా, యాప్స్ రూపొందించే నైపుణ్యం ఉన్న నిపుణుల సంఖ్య స్వల్పంగా ఉందని, ఈ లోటును భర్తీ చేయడానికే ఆండ్రాయిడ్ నానో డిగ్రీలను ఆఫర్ చేస్తున్నామని వివరించారు.
ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు...
ఆండ్రాయిడ్ నానో డిగ్రీ కార్యక్రమంలో భాగంగా డెవలపర్లు ఎక్కడ నుంచైనా, ఏ డివైస్తోనైనా కొత్త నైపుణ్యాలను కొన్ని నెలల్లోనే నేర్చుకొని తమ కెరీర్లో మరింత ముందుకు వెళ్లవచ్చని యుడాసిటీ వ్యవస్థాపకుడు, సీఈఓ సెబాస్టియన్ తరుణ్ చెప్పారు. ఈ కోర్సు కాలపరిమితి 6-9 నెలలని నెలకు రూ.9,800 ఖర్చవుతుందని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత ట్యూషన్ ఫీజులో 50 శాతం రిఫండ్ చేస్తామని వివరించారు. ఈ కోర్సుకు గూగుల్, టాటా ట్రస్ట్స్ సంస్థలు చెరో 500 ఉచిత స్కాలర్షిప్లను ఆఫర్ చేస్తున్నాయని చెప్పారు.
గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ నానో డిగ్రీలు
Published Tue, Sep 22 2015 12:57 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గుర్తింపు
ముస్లింలపై కూటమి కుట్ర
ఆ ఇంటికి నవరత్నాలే జీవనాధారం
నేడు పిఠాపురానికి సీఎం జగన్
కూటమిలో కుమ్ములాట
ఆర్ట్స్ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్న టీడీపీ
గాండ్ల, తెలుకుల, దేవతెలుకులకు సముచిత స్థానం
మద్యం అక్రమ రవాణాపై కేసులు
తప్పక చదవండి
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- రూ.300 పింఛన్ను రూ.400 చేస్తా
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement