హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సర్వీసు ఇండస్ట్రీకి హైదరాబాద్ హబ్గా మారిందని, మరిన్ని ఇన్నోవేషన్, ప్రోడక్ట్ కంపెనీలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఐటీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన అనంతరం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని, ఇందుకోసం టాటా, ఆదాని, కొకోకోలా వంటి కంపెనీ ప్రతినిధుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. కొత్త పరిశ్రమలను ఆకర్షించే విధంగా ఈ నూతన పారిశ్రామిక విధానం ఉంటుందన్నారు.
అలాగే ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల అభివృద్ధికోసం ప్రత్యేకంగా ఐటీ పాలసీని కూడా రూపొందిస్తున్నామని, పారిశ్రామిక విధానం వెలువడిన తర్వాత కొత్త ఐటీ విధానాన్ని ప్రకటిస్తామన్నారు. గత రెండు నెలల నుంచి ఐటీ, మాన్యుఫాక్చరింగ్, ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. అక్టోబర్లో జరగనున్న పెగా డెవలపర్స్ కాన్ఫెరెన్స్ వివరాలను తెలియచేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పలు అంతర్జాతీయ సదస్సులకు హైదరాబాద్ వేదికగా మారిందన్నారు.
అక్టోబర్ 12, 13 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు సుమారు 3,000 మంది పాల్గొనే అవకాశం ఉందని, గతేడాది ఈ సదస్సుకు 1,500 మంది హజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెగా సిస్టమ్స్ మేనేజింగ్ డెరైక్టర్ సుమన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 12,000 మంది డిజైనర్లు, డెవలపర్స్కి డిమాండ్ ఉందని, వచ్చే నాలుగేళ్లలో ఈ సంఖ్య 50,000కి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్లో కొత్త పారిశ్రామిక విధానం
Published Wed, Aug 13 2014 12:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement