హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను(ఎఫ్టీఏ) సమీక్షిస్తున్నట్టు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా తెలిపారు. ఎఫ్టీఏల కారణంగా దేశీయ తయారీ రంగం కుదేలవుతోందంటూ కంపెనీలు ఆందోళన చెందుతున్న విషయం వాస్తవమేనని అన్నారు. ఇక్కడి కంపెనీలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. భారతీయ కంపెనీల ప్రయోజనాలను కాపాడతామని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తగు నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. హెచ్ఆర్ సేవల సంస్థ టీఎంఐ గ్రూప్ వాయిస్ ఆధారిత మొబైల్ సొల్యూషన్ ‘జాబ్స్డైలాగ్’ను మంగళవారం హైదరాబాద్లో ఆవిష్కరించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
ఒకే కార్మిక చట్టం..: ప్రస్తుతమున్న కార్మిక చట్టాల స్థానంలో ఎంఎస్ఎంఈ రంగం కోసం ఒకే చట్టాన్ని తీసుకొస్తున్నట్టు మిశ్రా తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిని ప్రవేశపెడతామని పేర్కొన్నారు. టెక్నికల్ స్కూల్స్ ఏర్పాటుకు శాంసంగ్ తరహాలో మరిన్ని కంపెనీలతో చర్చిస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని మారుస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం కమిటీ ఏర్పాటైందని చెప్పారు. పెట్టుబడి, కార్మికుల సంఖ్యనుబట్టి సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ తరహా కంపెనీగా నిర్వచిస్తారు.
20 శాతం ఎంఎస్ఎంఈ నుంచే..
ప్రభుత్వ రంగ సంస్థలు ఎంఎస్ఎంఈల నుంచి 20 శాతం ఉత్పత్తులను కొనుగోలు చేయడం 2015 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగం కోసం కొత్త పాలసీ తీసుకొచ్చే పనిలో ఉన్నట్టు చెప్పారు. ముసాయిదా విధానం మూడు నాలుగు నెలల్లో ప్రకటి ంచే అవకాశం ఉందన్నారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలిస్తున్నామన్నారు. పాలసీలో చేర్చే అంశాలపై చర్చించేందుకు ఆర్థిక శాఖ, ఎంఎస్ఎంఈ, ఆర్బీఐకి చెందిన అధికారులతో కమిటీ ఏర్పాటైందన్నారు. ఎంఎస్ఎంఈ రంగ సమస్యలను పరిష్కరించే దిశగా బ్యాంకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
33 లక్షల మందికి..
2014-15లో 33 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా చేసుకున్నామని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవో దిలీప్ షెనాయ్ తెలిపారు. శిక్షణ తీసుకున్న వారిలో 63 శాతం మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని, దీనిని 70 శాతానికి చేర్చాలన్నది తమ ధ్యేయమని చెప్పారు. తమ కార్యకలాపాలను అన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్టు టీఎంఐ గ్రూప్ చైర్మన్ టి.మురళీధరన్ పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో సుమారు 13 లక్షల ఎంఎస్ఎంఈలు మూతపడిన ఫలితంగా 18 లక్షల మంది ఉపాధి కోల్పోయారని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు.
స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను సమీక్షిస్తున్నాం..
Published Wed, Aug 27 2014 1:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement