సెన్సెక్స్ కు 41 పాయింట్ల లాభం! | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు 41 పాయింట్ల లాభం!

Published Tue, Feb 25 2014 4:37 PM

సెన్సెక్స్ కు 41 పాయింట్ల లాభం!

భారత స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిసాయి. నిన్నటి ముగింపుకు సెన్సెక్స్ 41 పాయింట్ల లాభంతో 20852 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల వృద్ధితో 6200 వద్ద ముగిసింది. లోకసభ ఎన్నికల తర్వాత నరేంద్రమోడీ ఆధ్వర్యంలో ఎన్ డీఏ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సర్వే పోల్స్ వెల్లడిస్తున్న నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు స్థిరంగా ట్రేడ్ అవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
సూచీ ఆధారిత కంపెనీ షేర్లలో విప్రో అత్యధికంగా లాభపడగా, అంబుజా సిమెంట్స్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, భెల్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఎన్ ఎమ్ డీసీ, సెసా స్టెర్ లైట్, టాటా స్టీల్, కోల్ ఇండియా, టాటా పవర్ కంపెనీలు నష్ట్రాల్ని నమోదు చేసుకున్నాయి. 
 

Advertisement
Advertisement