భారత్లో 8,872 ఔట్లెట్ల రీబ్రాండింగ్
నోకియా, మైక్రోసాఫ్ట్ బ్రాండ్లలో ఫోన్లు ‘సాక్షి’తో మైక్రోసాఫ్ట్ మొబైల్ డెరైక్టర్ నిఖిల్ మాథుర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నోకియా ఔట్లెట్లు కొద్ది రోజుల్లో కనుమరుగు కానున్నాయి. రీబ్రాండింగ్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తొలి దశలో జూన్ నాటికి 15,684 ఔట్లెట్లు ‘మైక్రోసాఫ్ట్’ పేరుతో దర్శనమీయనున్నాయి. వీటిలో భారత్లో 8,872 ఔట్లెట్లతోపాటు 119 సర్వీసింగ్ కేంద్రాలు ఉన్నాయి.
నోకియా ఎక్స్క్లూజివ్ ఔట్లెట్లు మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్ స్టోర్లుగా, మల్టీబ్రాండ్ ఔట్లెట్లు మైక్రోసాఫ్ట్ మొబైల్ రీసెల్లర్ స్టోర్లుగా మారనున్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రియారిటీ రీసెల్లర్ స్టోర్స్లో మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన ఎక్స్బాక్స్ గేమింగ్ కన్సోల్స్, పీసీలు, మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ విక్రయిస్తారు. దక్షిణాది రాష్ట్రాల్లో 2,100 స్టోర్లు రీబ్రాండ్ చేస్తున్నామని మైక్రోసాఫ్ట్ మొబైల్ ఓవై బిజినెస్ సేల్స్, ఆపరేటర్ చానల్స్ డెరైక్టర్ నిఖిల్ మాథుర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ జూన్ తర్వాతి నుంచి ప్రస్ఫుటంగా కనిపిస్తుందని అన్నారు.
గోల్డెన్ డేస్ దిశగా..
ఐడీసీ ప్రకారం 2014 జనవరి-మార్చి త్రైమాసికంలో నోకియా వాటా 4 శాతానికి వచ్చి చేరింది. కొన్నేళ్ల క్రితం భారత్లో అగ్రశ్రేణి కంపెనీగా నోకియా వెలుగొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బ్రాండ్ తోడవ్వడంతో మార్కెట్లో పట్టుకు రంగంలోకి దిగింది. లూమియా ఫోన్ల ధరను కంపెనీ తగ్గిస్తూ వస్తోంది. లూమియా 430 మోడల్ను రూ.5,299లకే ఆవిష్కరించింది. లూమియా స్మార్టఫోన్లు ఇక నుంచి మైక్రోసాఫ్ట్ బ్రాండ్తోనే వస్తాయి.
ఫీచర్ ఫోన్లకు ఇంకా డిమాండ్ ఉన్నందున ఈ విభాగంలో నోకియా బ్రాండ్ మోడళ్లను కొనసాగిస్తామని నిఖిల్ పేర్కొన్నారు. ‘కస్టమర్ల అవసరాలను అధ్యయనం చేస్తున్నాం. ఫీచర్, స్మార్ట్ఫోన్ విభాగాల్లో అత్యుత్తమ మోడళ్లను అందించిన ఘనత మాది. అదే ఊపుతో విభిన్న ఫీచర్లతో సరికొత్త మోడళ్లను తీసుకొస్తున్నాం’ అని తెలిపారు. కంపెనీకి తిరిగి మంచి రోజులు వస్తాయన్న ధీమా వ్యక్తం చేశారు.
4జీలో సత్తా చాటుతాం..
దేశంలో 4జీ ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తోంది. చాలా లూమియా ఫోన్లు 4జీని సపోర్ట్ చేస్తాయి. మరిన్ని మోడళ ్లను టెలికం కంపెనీలతో కలిసి పరీక్షిస్తున్నామని నిఖిల్ తెలిపారు. టెక్నాలజీ విస్తరించగానే ఈ కంపెనీల భాగస్వామ్యంతో విభిన్న మోడళ్లను ప్రవేశపెడతామన్నారు. 4జీలో సత్తా చాటుతామని పేర్కొన్నారు. కాగా, నోకియా మొబైల్, సర్వీస్ విభాగాలను గతేడాది మైక్రోసాఫ్ట్ 7.5 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. సెబైక్స్ ఎగ్జిమ్ సొల్యూషన్స్ ప్రకారం 2015 జనవరి-మార్చి కాలంలో మైక్రోసాఫ్ట్ 9.30 లక్షల యూనిట్ల స్మార్ట్ఫోన్లను భారత్కు దిగుమతి చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ పరిమాణం 28 శాతం అధికం కావడం గమనార్హం.
నోకియా స్థానంలో మైక్రోసాఫ్ట్ స్టోర్లు
Published Thu, May 14 2015 12:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement