ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) విదేశాల్లో ఆర్జించిన ఆదాయంపై భారత్లో పన్ను ఉండదు. కానీ, కొందరు ఎన్నారైలకు తమ స్వదేశంలో డిపాజిట్లు, అద్దెల రూపంలో ఆదాయాలుంటాయి. ఇలాంటి ఆదాయం వార్షిక పరిమితి రూ.2 లక్షలు మించితే వారు విదేశాల్లో నివసిస్తున్నా ఇక్కడ కూడా ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. డిపాజిట్లు, అద్దెలే కాకుండా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటిలోనూ లాభాలొస్తే వాటికీ పన్ను చెల్లించాలి. ఎన్నారైలు రిటర్నులు దాఖలు చేయడానికి గడువు జూలై 31. రిటర్నుల దాఖలుకు ముందు ఎన్నారైలు గమనించాల్సిన కొన్ని అంశాలివీ...
రిటర్నులు ఎప్పుడు దాఖలు చేయాలంటే..
ఇండియాలో ఆదాయం బేసిక్ మినహాయింపు పరిమితిని మించినపుడు; చెల్లించాల్సిన పన్ను కంటే ఎక్కువ డిడక్ట్ చేసినపుడు; మూలధన నష్టాల(క్యాపిటల్ లాస్)కు సంబంధించిన క్లెయిమ్ల పరిష్కారానికి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను విధించదగిన ఆదాయం విషయంలో వ్యక్తులకు కొన్ని మినహాయింపులుంటాయి.
కొన్ని రకాల పెట్టుబడులు, గృహ రుణంలో అసలును చెల్లించడం మొదలైనవి. ఈ మినహాయింపులు ఎన్నారైలకు కూడా వర్తిస్తాయి. దాఖలు చేసిన ట్యాక్స్ రిటర్నుల నుంచి రిఫండ్ కోసం బ్యాంకు అకౌంటు నంబరు, బ్రాంచ్ ఎంఐసీఆర్ కోడ్ వంటి మీ బ్యాంకు వివరాలను లోపరహితంగా అందించాలి. ఆన్లైన్లో రిటర్నులు దాఖలు చేసినపుడు రిఫండ్ కూడా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిగిపోతుంది.
ఆదాయ పన్ను శాఖ వారి ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఎన్నారైలు తమ రిటర్నులను ఆన్లైన్లో దాఖలు చేయవచ్చు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ట్యాక్స్ అడ్వైజర్ల సహాయాన్ని వారు పొందవచ్చు. లేదంటే ప్రైవేట్, పెయిడ్ ఈ-ఫైలింగ్ పోర్టల్స్ ద్వారానూ రిటర్నులు పంపవచ్చు. ఎన్నారైలకు సంబంధించి... భారత్లో వారి ఆదాయమంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్, పెట్టుబడులపై ఆదాయం మాత్రమే ఉంటాయి. మినహాయింపు పరిమితిలోపు ఆదాయం ఉంటే రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఆదాయ స్థానంలోనే పన్ను తగ్గింపు జరిగినా రిటర్నులు సమర్పించనక్కర్లేదు.
ఎన్నారైలు...ట్యాక్స్ రిటర్నులు
Published Sun, Jun 15 2014 1:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
Advertisement