ముంబై: అంతర్జాతీయంగా తక్కువ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లను అకస్మాత్తుగా, అసంబద్ధంగా పెంచేస్తే.. పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఇలాంటి వాటివల్ల పెట్టుబడి నిర్ణయాలు దెబ్బ తింటాయని, ఎకానమీల స్వరూపంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
కాబట్టి, ఈ మార్పులను జాగ్రత్తగా, అంచనాలకు అనుగుణంగా ఉండేలా మాత్రమే చేపట్టాలని రాజన్ సూచించారు. 2008 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం గురించి ముందస్తుగానే చెప్పిన రాజన్.. తాజాగా ఈ తరహా హెచ్చరిక చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఇప్పటికే అంతా పెను సంక్షోభంలో ఉన్నాం. వడ్డీ రేట్లను అర్ధాంతరంగా మార్చేస్తే చాలా పెద్ద స్థాయిలో హాని జరుగుతుంది. కనుక ఇందులో నుంచి ఒక్కసారిగా గాకుండా క్రమక్రమంగా, జాగ్రత్తగా బైటికి రావాలన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ అధికారుల వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను’ అని రాజన్ చెప్పారు.
చౌక వడ్డీల మీద భారీ స్థాయిలో మూలధన సమీకరణ జరిగిందని, ఇప్పుడు అక స్మాత్తుగా రేట్లను మార్చేస్తే పెట్టుబడి నిర్ణయాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీర్ఘకాలం పాటు తక్కువ వడ్డీ రేట్లను కొనసాగించడం వల్ల సమస్యలు రావొచ్చా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ద్రవ్య పరపతి విధానం కొంత వరకూ మాత్రమే పనిచేస్తుందన్నది తన అభిప్రాయమన్నారు. నిర్దిష్ట స్థాయి దాటితే అది మంచి కన్నా ఎక్కువగా చెడే చేసే ప్రమాదం ఉందని రాజన్ వ్యాఖ్యానించారు.
నిరంతరాయం సమస్యల నుంచి గట్టెక్కిస్తామంటూ సంవత్సరాల తరబడి మార్కెట్లను.. సెంట్రల్ బ్యాంకులు భరోసా ఇస్తూ వచ్చాయని ఆయన చెప్పారు. వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు తక్కువ స్థాయిలో ఉంచి, అసెట్ ధరలు భారీగా పెరిగిపోయేలా చేశాయని, దీంతో ఏ కాస్త ప్రతికూల వార్త వచ్చినా మార్కెట్లు కంపించి పోయే పరిస్థితి ఏర్పడిందని రాజన్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు, వర్ధమాన దేశాలు దీర్ఘకాలికంగా తమను తాము రక్షించుకునేందుకు తీసుకుంటున్న చర్యలు అమెరికాపై ప్రభావం చూపుతున్నాయన్నది ఆ దేశం గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో విధానాల విషయంలో సంప్రదింపులు జరపడం, సఖ్యతగా వ్యవహరించడం ద్వారా అమెరికా తన ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీలుంటుందని రాజన్ చెప్పారు. అమెరికా తాను సృష్టించిన అస్థిరత పరిష్కారం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే.. మిగతా వారు స్పందించాల్సి ఉంటుందని, దీంతో అందరిపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
అసంబద్ధ వడ్డీ రేట్ల పెంపుదలతో ఎకానమీకి దెబ్బ
Published Fri, Sep 12 2014 12:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
తప్పక చదవండి
- పొట్ట తగ్గాలంటే.. జిమ్కే వెళ్లాలా? ఏంటి?
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
Advertisement