ఆర్‌బీఐ కొత్త రూ.5 నాణెం! | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ కొత్త రూ.5 నాణెం!

Published Fri, Sep 4 2015 1:25 AM

ఆర్‌బీఐ కొత్త రూ.5 నాణెం! - Sakshi

ముంబై: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అతి త్వరలో కొత్త రూ.5 నాణేలను మార్కెట్‌లోకి తీసుకురానుంది. 1965లో జరిగిన ఇండో-పాక్ యుద్ధం 50వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నాణేలను ముద్రిస్తున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నాణెంలో ఒకవైపు అశోక స్తంభపు లయన్ క్యాపిటల్ మధ్యలో ఉండి, దాని కింద సత్యమేవ జయతే అని ఉంటుంది. మరొకవైపు ‘అమర్ జవాన్’ స్మారక చిహ్నం మధ్యలో ఉండి దానికి ఇరువైపుల ఆలివ్ కొమ్మ ఆకులు, కింది భాగంలో 2015 అని సంవత్సరం పేరు ఉంటుంది.

Advertisement
Advertisement