గత సంచికలో వేతనజీవుల రిటర్నుల విషయంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. అదే విధంగా ఈ రోజు వ్యాపారస్తుల రిటర్నులకు సంబంధించిన కీలక అంశాల గురించి తెలుసుకుందాం. వ్యాపారస్తులకు వర్తించే ప్రధానమైన ఫారాలు రెండు ఉంటాయి. అవి ఐటీఆర్ 3, ఐటీఆర్4.
ఐటీఆర్ 3..
♦ వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబం ఈ ఫారం వేయవచ్చు.
♦ వ్యాపారం మీద ఆదాయంతో పాటు ఇతర ఆదాయాలు అంటే జీతం, ఇంటద్దె, మూలధన లాభాలు మొదలైనవి ఉన్నవారు కూడా దీన్ని వేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ఆదాయాలు ఉన్నవారు ఈ ఫారంలోనే ఆదాయాన్ని డిక్లేర్ చేయాలి.
♦ ఈ–ఫైలింగ్ కంపల్సరీ. మినహాయింపు లేదు.
♦ డిజిటల్ సంతకం తప్పనిసరి కాదు.
♦ కొంత మందికి ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండి.. వాటి మీద ఆదాయం అందుకుంటూ ఉండవచ్చు. దీనితో పాటు వ్యాపారం మీద ఆదాయం ఉన్నట్లయితే.. ఈ ఫారం వాడాలి.
♦ ఇంటి మీద ఆదాయంలో నష్టం వచ్చినవాళ్లు, అలాంటి నష్టాన్ని సర్దుబాటు కాకుండా తర్వాత సంవత్సరాలకు బదిలీ చేసుకోవాల్సిన వాళ్లు (క్యారీ ఫార్వర్డ్) ఈ ఫారం ద్వారా రిటర్నులు వేయాలి.
♦ వ్యవసాయ ఆదాయం రూ. 5,000 దాటినవాళ్లు కూడా దీన్ని ఉపయోగించాలి.
♦ అలాగే మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటినవాళ్లు కూడా ఈ ఫారం ద్వారా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
♦ లాటరీలో గెలిచిన వారు, గుర్రపు పందేలలో లాభం వచ్చిన వారు.. అలాగే ఇతర ఆదాయంలో ‘నష్టం’ వచ్చిన వారు దీన్ని వేయొచ్చు.
♦ మూలధన లాభాలు లేదా నష్టాలు వచ్చిన వారు వేయొచ్చు.
♦ భాగస్వామ్యంలో వడ్డీ, జీతం, లాభంలో వాటాలు ఉన్న వారు ఫారం 3ని ఉపయోగించాలి.
♦ విదేశాల నుంచి ఆదాయం, ఆస్తులు, ఇతరత్రాలు ఉన్నవాళ్లు వేయొచ్చు.
♦ స్వంతంగా ఆదాయం డిక్లేర్ చేద్దామనుకున్న వాళ్లూ వేయొచ్చు.
♦ నష్టాలను రాబోయే సంవత్సరంలో సర్దుబాటు చేసుకోవాలనుకునే వారూ వేయొచ్చు.
ఐటీఆర్ 4 ఫారం..
♦ వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబం ఈ ఫారం వేయొచ్చు.
♦ వ్యాపారంలో లెక్కలతో నిమిత్తం లేకుండా లేక వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కొంత శాతాన్ని లాభంగా డిక్లేర్ చేసే విధానాన్ని ‘ఊహాజనిత ఆధారం’గా వ్యవహరిస్తారు. దీనికి కూడా ఈ ఫారంను ఉపయోగించవచ్చు.
♦ ఈ–ఫైలింగ్ తప్పనిసరి.
♦ 80 యేళ్లు దాటినవారికి, రూ. 5 లక్షల లోపు ఆదాయం గలవారికి మాత్రం తప్పనిసరి కాదు.
♦ ‘ఊహాజనిత ఆధారం’గా లెక్కించిన ఆదా యంతో పాటు జీతం, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉన్నవారు దీన్ని వేయొచ్చు.
♦ ఆదాయం రూ. 50,00,000 దాటినవారు ఈ ఫారం వేయొచ్చు.
♦ ఈ ఫారం వేసేవాళ్లు బుక్స్ రాయనక్కర్లేదు.
♦ టర్నోవరు రూ. 2 కోట్లు దాటిన వాళ్లు ఈ ఫారం ద్వారా రిటర్నులు వేయరాదు.
♦ 44 అఈ, 44 అఉ ప్రకారం ఈ పన్నులను లెక్కించవచ్చు.
♦ 44 అఈ ప్రకారం ఆదాయాన్ని టర్నోవరులో 8 శాతం కన్నా ఎక్కువ డిక్లేర్ చేయొచ్చు.
♦ 44 అఉ ప్రకారం రవాణా చేసే వాహనాలకైతే.. బండికి ఇంత ఆదాయమని నిర్దేశించారు. నెలకి ఒక్కో బండికి రూ.7,500కన్నా ఎక్కువ డిక్లేర్ చేసుకోవచ్చు.
చివరగా.. ఈ–వెరిఫికేషన్ గతంలో చెప్పిన విధంగా చేయొచ్చు. ఏదేని కారణం వలన ఈ–వెరిఫై చేయకపోతే అక్నాలెడ్జ్మెంట్ని బెంగళూరు పంపవలసి ఉంటుంది.
వ్యాపారస్తులకు రిటర్ను ఫారంలు..
Published Mon, Jul 16 2018 1:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement