హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ, ఇన్ఫ్రా రంగంలో ఉన్న కేజేఆర్ గ్రూప్ మహబూబ్నగర్ జిల్లా ఇటిక్యాల వద్ద ఏర్పాటు చేస్తున్న రాగమయూరి మెగా ఫుడ్ పార్క్కు ఫిబ్రవరి తొలివారంలో శంకుస్థాపన జరుగనుంది. 124 ఎకరాల్లో వస్తున్న ఈ పార్క్కై కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ రూ.50 కోట్ల గ్రాంటును మంజూరు చేసింది. నాబార్డు రూ.47 కోట్ల రుణం ప్రకటించింది. కేజేఆర్ గ్రూప్నకు చెందిన రాగమయూరి బిల్డర్స్ రూ.27 కోట్లు ఈక్విటీగా సమకూరుస్తోంది. శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రులతోపాటు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ముఖ్య అతిథులుగా వస్తున్నారని గ్రూప్ సీఎండీ కె.జె.రెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, పార్కులో డిసెంబర్లోగా అన్ని మౌలిక వసతుల ఏర్పాటు పూర్తి అవుతుందని చెప్పారు.
దేశంలో తొలిసారిగా..: ఫుడ్ పార్కులో రాగమయూరి ఫుడ్, బెవరేజెస్ రూ.35 కోట్లతో యాంకర్ యూనిట్ను నెలకొల్పుతోంది. ఇందులో భారత్లో తొలిసారిగా బియ్యంతో పాస్తా తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం జర్మనీ టెక్నాలజీ వాడుతున్నామని కేజే రెడ్డి తెలిపారు. ‘గంటకు 300 కిలోల తయారీ సామర్థ్యం గల ఈ యూనిట్కై రూ.20 కోట్లు వెచ్చిస్తున్నాం. పాస్తాను తొలుత జర్మనీకి ఎగుమతి చేస్తాం. మహబూబ్నగర్, కర్నూలులో పండే బియ్యం కొంత తీపిగా ఉంటాయి.
ఇవి పాస్తా తయారీకి మేలైనవి. అరటి పండ్లను పొడిగా చేసే యూనిట్ను సైతం నెలకొల్పుతున్నాం. ఇది దక్షిణాదిన తొలి యూనిట్ అవుతుంది. పులివెందుల నుంచి అరటి పండ్లను సేకరిస్తాం. అలాగే శుభమస్తు బ్రాండ్లో బియ్యం, దినుసులు, మసాలాలను విక్రయిస్తాం’ అని వెల్లడించారు.
ప్రత్యక్షంగా 10,000 మందికి ఉపాధి..
పార్కు ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికిపైగా ఉపాధి లభిస్తుంది. అలాగే ఒక లక్ష మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. టమాటా, బొప్పాయి, అరటి, ఉల్లి తదితర పంటలు పండించే రైతులతో నేరుగా ఒప్పందం చేసుకుంటామని గ్రూప్ సీఎండీ తెలిపారు. పార్కులో 60 ప్రాసెసింగ్ యూనిట్ల దాకా వస్తాయని కంపెనీ భావిస్తోంది. మొత్తంగా రూ.2,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.
భారత్లో తొలిసారిగా బియ్యం పాస్తా తయారీ యూనిట్
Published Sat, Jan 9 2016 1:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement