హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టైర్ల తయారీలో ఉన్న ఎంఆర్ఎఫ్ (మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ) తెలంగాణలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ మొత్తాన్ని మెదక్ జిల్లా సదాశివపేట ప్లాంటు విస్తరణకు వెచ్చించనుంది. తెలంగాణలో పెట్టుబడికి ఎంఆర్ఎఫ్ సుముఖంగా ఉందని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర సాక్షి బిజినెస్ బ్యూరోకు బుధవారం తెలిపారు. ప్రభుత్వ పరంగా కంపెనీకి అన్ని రకాల అనుమతులను సత్వరం ఇస్తామని చెప్పారు.
తెలంగాణలో కంపెనీకి మెదక్ జిల్లా సదాశివపేటతోపాటు ఇదే జిల్లాలో అంకెన్పల్లి వద్ద ప్లాంట్లున్నాయి. అటు ఎంఆర్ఎఫ్ పెద్ద ఎత్తున విస్తరణ బాట పట్టింది. ప్లాంట్ల విస్తరణకు వచ్చే మూడేళ్లలో రూ.4,000 కోట్లు వెచ్చిస్తామని 2014 డిసెంబర్లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కోషీ వర్గీస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2010 తర్వాత కంపెనీ ఇంత పెద్ద ఎత్తున విస్తరణ ప్రణాళికతో ముందుకు రావడం ఇదే మొదటిది. రూ.3,000 కోట్లతో అయిదేళ్ల క్రితం ఎంఆర్ఎఫ్ విస్తరణ చేపట్టింది.
ఇందులో భాగంగానే తిరుచ్చి సమీపంలో ప్లాంటును స్థాపించింది. తాజాగా ఎంఆర్ఎఫ్ ఉత్తరాఖండ్లో బిర్లా టైర్స్కు చెందిన ఒక యూనిట్ను కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు రూ.1,600 కోట్లకుపైగా వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఎంఆర్ఎఫ్కు దేశవ్యాప్తంగా 10 ప్లాంట్లున్నాయి. రోజుకు 1.2 లక్షల టైర్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. సెప్టెంబర్ 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.14,789 కోట్ల టర్నోవర్పై రూ.908 కోట్ల నికర లాభం ఆర్జించింది.
రూ.1,000 కోట్లతో తెలంగాణలో ఎంఆర్ఎఫ్ విస్తరణ
Published Thu, Feb 12 2015 1:35 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement