న్యూఢిల్లీ: దేశంలో దిగ్గజ బ్యాంకుగా ఉన్న ఎస్బీఐలో వచ్చే రెండేళ్లలో ఉద్యోగుల సంఖ్య 10 శాతం తగ్గనుంది. ఐదు అనుబంధ బ్యాంకులతోపాటు భారతీయ మహిళా బ్యాంకు ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐలో విలీనం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో శాఖలు, ఉద్యోగుల స్థిరీకరణపై దృష్టి పెట్టనున్న బ్యాంకు రెండేళ్ల కాలంలో ఉద్యోగుల నియామకాలను తగ్గించుకోవడంతోపాటు డిజిటైజేషన్ను అమలు చేయనున్నట్టు బ్యాంకు ఎండీ రజనీష్ కుమార్ తెలిపారు.
ఉద్యోగుల సంఖ్య రెండేళ్లలో 10 శాతం మేర తగ్గే అవకాశం ఉందన్నారు. ఎస్బీఐలో ప్రస్తుతం 2,07,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్; ట్రావెన్కోర్; పాటియాలా; మైసూర్, హైదరాబాద్; భారతీయ మహిళా బ్యాంకులు విలీనం అవుతుండడంతో ఎస్బీఐ ఉద్యోగుల సంఖ్యకు 70,000 పెరిగి 2,77,000 కానుంది. ఉద్యోగుల సంఖ్య 2019 మార్చి నాటికి 2,60,000కు తగ్గు తుందని, అంతకంటే తక్కువే ఉండవచ్చని, విలీనం అనంతరం అసలు ప్రభావం తెలుస్తుందని రజనీష్ చెప్పారు.
దీంతోపాటు ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు ఉంటాయని, ఉద్యోగుల తొలగింపు మాత్రం పరిశీలనలో లేదన్నారు. వీఆర్ఎస్ అవకాశం ఇచ్చామని, ఏటా తగ్గే ఉద్యోగుల సంఖ్యలో అంతే మొత్తం భర్తీ చేయడం లేదని, డిజిటల్ చర్యల కారణంగానూ ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఉద్యోగుల నియామకం ఆగదని, కాకపోతే 50% మేర తగ్గించుకుంటామని చెప్పారు.
ఎస్బీఐలో వచ్చే రెండేళ్లలో 10% ఉద్యోగాలు కట్
Published Mon, Mar 27 2017 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement