♦ అప్రాధాన్య ఆస్తుల విక్రయం,
♦ అనుబంధ విభాగాల లిస్టింగ్ సన్నాహాలు
న్యూఢిల్లీ: తాజా మూలధన పెట్టుబడులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి బాసెల్ 3 నిబంధనలను 2019 మార్చి నుంచి అమలుపై బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కీలక వ్యూహ రచన చేస్తోంది. వచ్చే మూడేళ్లలో అనుబంధ విభాగాలను మార్కెట్లో లిస్టింగ్ చేయడం, అప్రాధాన్య ఆస్తుల (నాన్-కోర్ అసెట్స్) విక్రయం వంటివి ఇందులో ఉన్నాయి.
బ్యాంక్ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ఇక్కడ అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు. బాసెల్ 3 ప్రమాణాల ప్రకారం... బ్యాంకింగ్కు రూ.1.80 లక్షల కోట్లు అవసరం. ఇందులో రూ.70,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. ఈ నేపథ్యంలో తనకు కావల్సిన మొత్తాలకు సంబంధించి ఎస్బీఐ దారులు వెతుకుతున్నట్లు బట్టాచార్య సంకేతాలు ఇచ్చారు. ముఖ్యాంశాలు చూస్తే...
ప్రభుత్వం అందించగా... మిగిలిన మొత్తాలను బ్యాంకులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లాభాలు, నాన్-కోర్ అసెట్స్ విక్రయాలు ఇందుకు ఒక మార్గం. ఎస్బీఐని తీసుకుంటే నగదుగా మార్చుకోడానికి పలు నాన్-కోర్ అసెట్స్ ఉన్నాయి. అలాగే విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ... లిస్టెడ్ కాని అనుబంధ విభాగాలూ ఉన్నాయి. కనుక ఇందుకు సంబంధించి లిస్టింగ్, విక్రయ అంశాలపై బ్యాంక్ దృష్టి పెడుతుంది.
ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జనరల్ వంటి బీమా వెంచర్లలో 10 శాతం, 23 శాతం చొప్పున తన వాటాల తగ్గింపునకు ప్రణాళికలను ఇప్పటికే బ్యాంక్ ప్రకటించింది. మా తరహాలోనే పలు బ్యాంకులూ మూలధన సమీకరణలకు తమతమ వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి.
బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు అధికంగా ఉన్నాయనడంలో నిజం లేదు. డిపాజిట్ రేట్లు ద్రవ్యోల్బణానికి తగిన విధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రుణ రేటు తగ్గింపు కష్టం.
ఎస్బీఐ నిధుల వేట!
Published Wed, Jan 13 2016 1:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement