సాక్షి, గుంటూరు: ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రధాన కర్తవ్యమని సెబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కె. రంగనాయకులు అన్నారు. శనివారం గుంటూరులో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్), సెబీ ఆధ్వర్యంలో మార్కెట్ భద్రతపై ఇన్వెస్టర్లకు నిర్వహించిన ప్రాంతీయ స్థాయి అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోతే గనక ఇన్వెస్టర్లు సెబీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్ నెంబరు-10లో ఉన్న సెబీ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు. సెబీ డీజీఎం సంజయ్ సీ పురావ్, ఎన్ఎస్డీఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సమర్ బన్వత్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజరు ఎం. రవికుమార్, హెచ్డీఎఫ్సీ ప్రతినిధి సుమన్బాబు తదితరులు పాల్గొన్నారు.
500 కోట్ల రికవరీకి నోటీసులు: సిన్హా
ముంబై: ఉల్లంఘనలకు పాల్పడిన, బకాయిలు ఎగ్గొట్టిన కంపెనీల నుంచి దాదాపు రూ.500 కోట్లు పైగా రాబట్టేందుకు గత రెండు నెలల్లో నోటీసులు పంపినట్లు సెబీ చైర్మన్ యూకే సిన్హా చెప్పారు. ఆయా కంపెనీలకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపజేసినట్లు ఒక సదస్సులో ఆయన చెప్పారు. మరోవైపు, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ సారథ్యంలోని నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ సంక్షోభం ప్రభావం.. మరో గ్రూప్ సంస్థ ఎంసీఎక్స్-ఎస్ఎక్స్పై ఉండదని సిన్హా చెప్పారు. తన పరిధిలోకి వచ్చే ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ నియంత్రణ పకడ్బందీగా ఉండేలా సెబీ కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు.
ఇన్వెస్టర్ల కోసమే సెబీ
Published Sun, Nov 24 2013 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement