వర్షాలు ఆలస్యమైనప్పటికీ ద్రవ్యోల్బణంపై ఆందోళనలు అక్కర్లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇచ్చిన అభయంతో స్టాక్ మార్కెట్లు మరోసారి కొత్త రికార్డులను సాధించాయి. అమెరికా సూచీ డోజోన్స్ 17,000 పాయింట్లను అధిగమించడం, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు బాగా దిగిరావడం కూడా ఇందుకు దోహదపడింది. వెరసి సెన్సెక్స్ 138పాయింట్లు పుంజుకుని 25,962 వద్ద ముగిసింది.
ఇక నిఫ్టీ కూడా 37 పాయింట్లు బలపడి 7,752 వద్ద నిలిచింది. ఇవి సరికొత్త గరిష్టాలుకాగా, ఒక దశలో సెన్సెక్స్ 160 పాయింట్లకుపైగా నష్టపోయింది. కనిష్టంగా 25,659ను తాకింది.తగిన స్థాయిలో నిల్వ ఉంచిన ఆహారోత్పత్తుల విడుదల ద్వారా ధరలు పెరగకుండా చూస్తామని జైట్లీ వ్యాఖ్యానించడంతో చివర్లో సెంటిమెంట్ మెరుగుపడిందని నిపుణులు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా బ్లాక్మార్కెటీర్లపై తగిన చర్యలను చేపట్టనున్నట్లు జైట్లీ తెలియజేయడం, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారల్కు 111 డాలర్ల దిగువకు చేరడం వంటి అంశాలు కూడా దీనికి బలాన్ని చేకూర్చాయని వ్యాఖ్యానించారు. కాగా, ఈ వారంలో సెన్సెక్స్ 862 పాయింట్లు లాభపడటం విశేషం!
ఎఫ్పీఐల కొనుగోళ్లు
నాలుగు రోజుల్లో రూ. 4,400 కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) తాజాగా రూ. 943 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీ సంస్థలు రూ. 853 కోట్ల అమ్మకాలు చేపట్టాయి. ప్రధానంగా ఆయిల్, రియల్టీ రంగాలు 1%పైగా లాభపడ్డాయి.
కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంచే ప్రతిపాదనలపై ఆయిల్ శాఖ నిపుణుల కమిటీని నియమించనుందన్న వార్తలతో చమురు, గ్యాస్ షేర్లు వెలుగులో నిలిచినట్లు విశ్లేషకులు తెలిపారు. పెట్రోనెట్ ఎల్ఎన్జీ, ఆర్ఐఎల్, ఐవోసీ, హెచ్పీసీఎల్, గెయిల్ 4-1% మధ్య పురోగమించాయి. సెన్సెక్స్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.3%, డాక్టర్ రెడ్డీస్ 1.6% చొప్పున లాభపడగా, సెసాస్టెరిలైట్, విప్రో 1.5% స్థాయిలో నష్టపోయాయి.
చిన్న షేర్లు ఓకే
మార్కెట్లకు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు 0.5%పైగా లాభపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,683 లాభపడితే, 1,357 నష్టపోయాయి. కంపెనీ పునరుద్ధరణకు ప్రభుత్వం రూ. 990 కోట్ల ప్యాకేజీని ఇవ్వనుందన్న వార్తలతో ఫ్యాక్ట్ షేరు 5% ఎగసింది. మిడ్ క్యాప్స్లో హిందుజా గ్లోబల్ 20% దూసుకెళ్లగా, యునెటైడ్ బ్యాంక్, స్టేట్బ్యాంక్ ఆఫ్ బికనీర్, పొలారిస్, కాక్స్అండ్కింగ్స్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, కార్బొరేండమ్, ఇక్రా, ట్రీహౌస్, మహీంద్రా సీఐఈ, పీసీ జ్యువెలరీ, రోల్టా, కేపీఐటీ కమిన్స్ 13-6% మధ్య జంప్చేశాయి.
మార్కెట్ మరో కొత్త రికార్డ్
Published Sat, Jul 5 2014 12:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement