సెన్సెక్స్ కు 192 పాయింట్ల నష్టం! | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ కు 192 పాయింట్ల నష్టం!

Published Thu, Jul 31 2014 3:49 PM

సెన్సెక్స్ కు 192 పాయింట్ల నష్టం!

హైదరాబాద్: గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూలత ప్రభావంతో జూలై నెల డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాలతో ముగిసాయి. 
 
సెన్సెక్స్ 192 పాయింట్ల నష్టంతో 25894 వద్ద, నిఫ్టీ 70 పాయింట్లు క్షీణించి 7721 వద్ద ముగిసాయి. 
 
సిప్లా, టాటా స్టీల్, బీపీసీఎల్, లుపిన్, గెయిల్ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఎన్టీపీసీ, హెచ్ సీఎల్ టెక్, ఐడీఎఫ్ సీ, యాక్సీస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ నష్టాలతో ముగిసాయి. 
 

Advertisement
Advertisement