• 83 పాయింట్ల లాభంతో 27,117కు సెన్సెక్స్
• 42 పాయింట్ల లాభంతో 8,392కు నిఫ్టీ
బడ్జెట్పై ఆశలతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఇటీవల పతనం కారణంగా పడిపోయిన షేర్లలో కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 83 పాయింట్లు లాభపడి 27,117 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 8,392 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎఫ్ఎంసీజీ, లోహ, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ షేర్లు పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఇన్ఫ్రా షేర్లు పతనమయ్యాయి.
ట్రేడింగ్ ఆద్యంతం స్టాక్ సూచీలు స్వల్ప రేంజ్లోనే కదలాడాయి. జనవరి సిరీస్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు మరో మూడు రోజుల్లో ముగియనున్నందున ట్రేడింగ్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థలో జోష్ పెంచడానికి బడ్జెట్లో రాయితీలు ఉంటాయనే అంచనాలతో కొనుగోళ్ల జోరు పెరిగింది.
లాభాల్లో లోహషేర్లు
లండన్ మెటల్ ఎక్సే్ఛంజ్(ఎల్ఎంఈ)లో ప్రధాన లోహాల ధరలు పెరగడంతో లోహ, మైనింగ్ షేర్లు లాభపడ్డాయి. టాటా స్టీల్, హిందాల్కో, నాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్, హిందుస్తాన్ జింక్, వేదాంత, ఎన్ఎండీసీ షేర్లు 6 శాతం వరకూ పెరిగాయి. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు పెరిగాయి. 11 షేర్లు నష్టపోయాయి. గెయిల్ 2.4 శాతం, హెచ్డీఎఫ్సీ 1.7 శాతం, టాటా మోటార్స్ 1.7 శాతం చొప్పున లాభపడ్డాయి. ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, ఎస్బీఐ, ఐడియా సెల్యులర్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గెయిల్ ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యెస్ బ్యాంక్ లాభపడ్డాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, భారతీ ఇన్ఫ్రాటెల్, డాక్టర్ రెడ్డీస్ 2 శాతం వరకూ నష్టపోయాయి. బీఎస్ఈలో 1,611 షేర్లు లాభాల్లో, 1,103 షేర్లు నష్టాల్లో ముగిశాయి.ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.
స్వల్ప లాభాలు బడ్జెట్పై ఆశలతో కొనుగోళ్ల జోరు
Published Tue, Jan 24 2017 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement