మార్చి నెల డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో బుధవారం స్టాక్ సూచీలు ఆద్యంతం తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆరంభ లాభాలను కోల్పోయి చివరకు నష్టాల్లో ముగిశాయి. రూపాయి పతనం, అంతర్జాతీయ వృద్ధి మందగమనంపై ఆందోళనలు ప్రతికూల ప్రభావం చూపాయి. బీఎస్ఈ నిఫ్టీ 101 పాయింట్లు తగ్గి 38,133 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 38 పాయింట్లు తగ్గి 11,445 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫార్మా, వాహన, రియల్టీ షేర్లు నష్టపోయాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి పుంజుకుంటుందన్న అంచనాలు, ప్రస్తుతం లిక్విడిటీ మెరుగుపడటం వంటి సానుకూలతల కారణంగా ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్బ్యాంక్, ఎస్బీఐ వంటి బ్యంక్షేర్లు లాభపడ్డాయి. దీంతో నష్టాలు పరిమితమయ్యాయి.
480 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్...
జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం ట్వీట్ చేశారు. ఈ ప్రసంగంపై ఊహాగానాలతో స్టాక్ సూచీలు ఊగిసలాటకు గురయ్యాయి. ఉపగ్రహాన్ని కూల్చే క్షిపణి(ఏశాట్)ను భారత్ తయారు చేసిందని, శాటిలైట్ను కూల్చే పరీక్ష, ఆపరేషన్ శక్తి విజయవంతమైందన్న మోదీ ప్రకటనతో మార్కెట్ లాభపడింది. మధ్యాహ్నం వరకూ లాభాలు కొనసాగాయి. ఇటీవల బాగా పెరిగిన బ్లూ చిప్షేర్లలో మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, యూరప్ మార్కెట్లు బలహీనంగా ఆరంభం కావడంతో అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో నష్టాల్లోకి జారిపోయిన సెన్సెక్స్ చివరకు నష్టాల్లోనే ముగిసింది. ఒక దశలో 243 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 237 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 480 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 63 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 70 పాయింట్లు పడిపోయింది. డాలర్తో రూపాయి మారకం 2 పైసలు తగ్గి 68.88 వద్ద ముగిసింది. మందగమన భయాల నేపథ్యంలో వివిధ దేశాల కేంద్ర బ్యాంక్లు ఎలాంటి చర్యలు తీసుకుంటాయోనన్న అనిశ్చితి కారణంగా ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
►జెట్ ఎయిర్వేస్ లాభాలు కొనసాగాయి. ఏప్రిల్ చివరి నాటికి 40 అదనపు విమాన సర్వీసులు నిర్వహించాలన్న కంపెనీ లక్ష్యం దీనికి ప్రధాన కారణం. ఇంట్రాడేలో 6 శాతం ఎగసిన ఈ షేర్ చివరకు 2.2 శాతం లాభంతో రూ.277 వద్ద ముగిసింది. గత మూడు రోజుల్లో ఈ షేర్ మొత్తం 20 శాతం మేర పెరిగింది.
బ్లూ చిప్ షేర్లలో లాభాల స్వీకరణ
Published Thu, Mar 28 2019 12:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement