Sakshi News home page

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

Published Tue, Jan 2 2018 9:45 AM

Sensex, Midcap open up over 100 pts; Nifty nears 10,500 - Sakshi

ముంబై : దేశీయ బెంచ్‌ మార్కు సూచీలు జనవరి 1 నష్టాల నుంచి బయటపడ్డాయి. ప్రారంభంలో సెన్సెక్స్‌ 100 పాయింట్లకు పైగా ఎగిసింది. ఫార్మా, మెటల్స్‌, టెక్నాలజీ స్టాక్స్‌ మద్దతుతో సెన్సెక్స్‌ లాభాలు పండించినట్టు మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంలో 33,835 వద్ద, నిఫ్టీ 14.55 పాయింట్ల లాభంలో 10,450 వద్ద కొనసాగుతోంది.

మహింద్రా అండ్‌ మహింద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, సిప్లా, సన్‌ ఫార్మా, గెయిల్‌, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ లాభాలు పండించగా... ఎస్‌బీఐ, ఐషర్‌ మోటార్స్‌ నష్టాలు గడించాయి.  అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ భారగా బలపడి 36 పైసల లాభంలో 63.72గా ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో బంగారం ధరలు 40 రూపాయల నష్టంలో రూ.29,116గా ఉన్నాయి. 

Advertisement
Advertisement