హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. విదేశీ నిధుల ప్రవాహం, రిటైల్, ఫండ్ ఇన్వెస్టర్లు ఎడతెగని కొనుగోళ్లు జరపడంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలను నమోదు చేసుకున్నాయి.
బ్యాంకింగ్, రియాల్టీ, పవర్, మెటల్ రంగాల కంపెనీ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ 645 పాయింట్ల లాభంతో 22989 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల వృద్దితో 6854 వద్ద కొనసాగుతున్నాయి.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో ఐడీఎఫ్ సీ అత్యధికంగా 7.24 శాతం లాభపడగా, అంబుజా సిమెంట్స్ 6.97 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్, ఏసీసీ, టాటా వపర్ కంపెనీల షేర్లు 5 శాతానికి పైగా లాభాల్లో కొనసాగుతున్నాయి. లుపిన్, డాక్టర్ రెడ్డీస్, ఎన్ ఎమ్ డీసీ, కెయిర్న్ ఇండియా కంపెనీల షేర్లు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.