♦ సెన్సెక్స్ 255 పాయింట్లు, నిఫ్టీ 69 పాయింట్లు అప్
♦ సానుకూల అంతర్జాతీయ సంకేతాలు
♦ జీఎస్టీ అమలుపై భరోసా
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు.. జీఎస్టీ అమలుకు కేంద్రం శరవేగంగా చర్యలు చేపట్టడంతో సోమవారం మార్కెట్ పరుగులు తీసింది. ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ 31,362 పాయింట్లస్థాయికి ఎగిసిన తర్వాత..చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 255 పాయింట్ల లాభంతో 31,312 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్కు ఇది రికార్డు ముగింపు. జూన్ 5నాటి 31,309 పాయింట్ల ముగింపుస్థాయికంటే ఎగువన ముగిసి ఈ సూచి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇంట్రాడేలో 9,673 పాయింట్ల వరకూ పెరిగిన ఎన్ఎస్ఈ నిఫ్టీ...చివరకు 69 పాయింట్ల పెరుగుదలతో 9,657 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
జీఎస్టీ వ్యవస్థలోకి వ్యాపారస్తులు సులభంగా మారేందుకు వీలుగా రిటర్నుల దాఖలు గడువును రెండు నెలలు పెంచడం పట్ల మార్కెట్ సెంటిమెంట్ బాగా మెరుగయ్యిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అలాగే రుణాలు ఎగవేసిన కార్పొరేట్లపై బ్యాంకులు దివాళా ప్రక్రియ ప్రారంభించడానికి రిజర్వుబ్యాంక్ ఒత్తిడి చేయడంవల్ల బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు మెరుగవుతాయన్న అంచనాలు కూడా మార్కెట్లో తాజా కొనుగోళ్లకు కారణమని విశ్లేషించారు.
ప్రపంచ మార్కెట్ల ర్యాలీ..: ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఎన్నికైన మాక్రాన్కు చెందిన సెంట్రిస్ట్ పార్టీ పార్లమెంటరీ ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించడం, బ్రిటన్...బ్రెగ్జిట్ చర్చల్ని ప్రారంభించడం వంటి సానుకూల అంశాల ప్రభావంతో ప్రపంచ ప్రధాన మార్కెట్లు కూడా పెరిగాయి.
రికార్డుస్థాయికి బ్యాంక్ నిఫ్టీ...
తాజా ర్యాలీలో బ్యాంకింగ్ షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టినిలపడంతో ఎన్ఎస్ఈ బ్యాంక్ నిఫ్టీ కొత్త రికార్డుస్థాయి 23,800 పాయింట్లకు తాకింది. చివరకు 1 శాతం లాభంతో చరిత్రాత్మక గరిష్టస్థాయి 27,750 పాయింట్ల వద్ద ముగిసింది.
మార్కెట్ జంప్
Published Tue, Jun 20 2017 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
RR vs SRH: చెలరేగిన నితీష్ కుమార్.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
TS: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
బీజేపీ కుట్రలు అడ్డుకుంటాం: సీఎం రేవంత్
విండీస్ క్రికెటర్కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.... ఐదేళ్ల పాటు నిషేధం
భర్తతో ఉన్న ఫోటోలు డిలీట్ చేయమన్న కత్రినా!
ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
ఈ బ్యూటీని గుర్తు పట్టారా? టీమిండియా స్టార్ భార్య.. రెండుసార్లు పెళ్లి! (ఫొటోలు)
తప్పక చదవండి
- కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై మండిపడ్డ మమతా బెనర్జీ
- 'కుబేర' సినిమా నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్
- ఓపెనర్గా కోహ్లి.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
- T20 WC: కోహ్లిపై విమర్శలు.. చీఫ్ సెలక్టర్ స్పందన ఇదే
- రజనీకాంత్ సినిమా మేకర్స్కు ఇళయరాజా నోటీసులు
- ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు: ఏపీ ఎన్నికల అధికారి ఎంకే మీనా
- ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు..
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- పవన్కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement