లాభాల్లో స్టాక్‌మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Published Wed, Oct 31 2018 9:37 AM

Sensex, Nifty start higher led by IT, bank shares - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి.   అనంతరం లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌  పాయింట్ల లాభంతో 34,013వద్ద,  నిఫ్టీ  43 పాయింట్లుఎగిసి 10,241వద్ద  కొనసాగుతున్నాయి. ఐటీ, బ్యాంకు షేర్లు లాభపడుతున్నాయి. అమెరికా రెగ్యులేటరీ  అబ్జర్వేషన్ల వార్తలతో డా.రెడ్డీస్‌ భారీ నష్టాలతో టాప్‌  లూజర్‌గా ఉంది.  ఇంకా  కోల్‌ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌,  టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌  6శాతానికి పైగా నష్టపోతున్నాయి. మరోవైపు ఎస్‌బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్‌, విప్రో, ఓన్‌జీసీ లాభపడుతున్నాయి.  మరోవైపు క్రూడ్‌ ధరలు దిగి వస్తున్నాయి.  12 శాతం నష‍్టంతో రెండు నెలల కనిష్టాన్ని నమోదు చేసింది.

Advertisement
Advertisement