8,600 పాయింట్ల దిగువకు నిఫ్టీ
71 పాయింట్ల నష్టంతో 8,561 వద్ద ముగింపు
194 పాయింట్ల నష్టంతో 27,656కు సెన్సెక్స్
బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్ల ముందు జాగ్రత్త, అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వీసా బిల్లు కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఆర్థిక సర్వే వృద్ధి అంచనాలను తగ్గించడం ప్రతికూల ప్రభావం చూపడంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,600 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్194 పాయింట్లు నష్టపోయి 27,656 పాయింట్ల వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు నష్టపోయి 8,561 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్కు ఇది వారం కనిష్ట స్థాయి. ఆయిల్, గ్యాస్, పీఎస్యూ, ఫార్మా, ఇన్ఫ్రా, లోహ షేర్లు నష్టపోయాయి.
లాభాల స్వీకరణ.. : పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, రుణ వృద్ధి అంతంతమాత్రంగానే ఉండడం, కమోడిటీ ధరలు పెరగడం, విదేశాల్లో పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడం తదితర కారణాల వల్ల వృద్ధి 6.5 శాతమే ఉండగలదని ఆర్థిక సర్వే అంచనా వేసిందని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఆర్థిక సర్వే వృద్ధి అంచనాలు, ట్రంప్ కఠినమైన వీసా బిల్లు నేపథ్యంలో టెక్నాలజీ షేర్లలో షార్ట్స్ బిల్డప్ కావడం ప్రతికూల ప్రభావం చూపాయి. పైగా బుధవారం బడ్జెట్ సమర్పణ నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.
ఐటీ షేర్లు డౌన్...: ట్రంప్ కఠినమైన వీసా నిబంధనల కారణంగా ఐటీ షేర్లు విలవిలలాడాయి.వీసా నిబంధనల కారణంగా హెచ్ 1 బీ వీసా ఉన్న వారికి ప్రస్తుతం ఇస్తున్న 60 వేల డాలర్ల వేతాన్ని లక్షన్నర డాలర్లకు ఐటీ కంపెనీలు పెంచాల్సి ఉంటుంది. దీంతో ఐటీ కంపెనీల లాభదాయకత ప్రభావితమవుతుందన్న అంచనాలతో ఐటీ షేర్లు కుదేలయ్యాయి. టీసీఎస్ 4.6 శాతం, ఇన్ఫోసిస్ 2 శాతం, టెక్ మహీంద్రా 4 శాతం వరకూ పతనమయ్యాయి. ఈ పతనంతో అగ్రశ్రేణి ఐదు (ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్) ఐటీ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.33,000 కోట్లు హరించుకుపోయింది. మిడ్ క్యాప్ ఐటీ కంపెనీల షేర్లు కూడా కుదేలయ్యాయి.
ట్రంప్ వీసా బిల్లుకు ఐటీ షేర్లు కుదేల్
Published Wed, Feb 1 2017 1:52 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తాతా.. నీకు టాటా..
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement