లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Wed, Jun 29 2016 4:26 PM

Sensex surges 215.84 points to end at 26,740.39; #Nifty reclaims 8,200

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన  సానుకూల ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు  బుధవారం లాభాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌ 215 పాయింట్ల లాభంతో  26,740 పాయింట్ల వద్ద  ముగిసింది. నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో  8,204 పాయింట్ల వద్ద ముగిసింది.  ఇక సెక్టార్‌ సూచీల్లో    పవర్  1.6శాతం,  రియాల్టీ 3.15శాతం ,  టెక్ సూచీలు 1.33 శాతం, లాభపడ్డాయి. నిఫ్టీ టాప్‌ గేయినర్స్‌ లిస్ట్‌లో బాష్ లిమిటెడ్‌ 5.92శాతం, హీరోమోటోకార్ప్‌  4.23 శాతం, ఎన్‌టిపిసి 2.74 శాతం లాబపడగా, నిఫ్టీ టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లో  ల్యూపిన్‌ 0.89శాతం, కోల్ ఇండియా 0.73 శాతం, ఐటిసి  0.57 శాతం నష్టపోయాయి.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement