♦ రికార్డుస్థాయి సమీపం నుంచి వెనుతిరిగిన సూచీలు
♦ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ప్రభావం
ముంబై: ఆగస్టు తొలివారంలో సృష్టించిన రికార్డు గరిష్టస్థాయికి బుధవారం చేరువగా వెళ్లిన సూచీలు..అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి వెనక్కు తగ్గాయి. ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినట్లు, జూలై నెలలో పారిశ్రామికోత్పత్తి 1.2 శాతం పెరిగినట్లు క్రితం రోజు మార్కెట్ ముగిసిన తర్వాత వచ్చిన నిరుత్సాహకర డేటాను లెక్కచేయకుండా...ట్రేడింగ్ తొలిదశలో ర్యాలీ జరిగింది. అయితే విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం, యూరప్ మార్కెట్లు బలహీనంగా ప్రారంభంకావడంతో ట్రేడింగ్ ముగింపులో మార్కెట్ చాలావరకూ లాభాల్ని కోల్పోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పలాభంతోనూ, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పనష్టంతోనూ ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 10.131 పాయింట్ల గరిష్టస్థాయికి వరకూ పెరిగిన తర్వాత..10,100 పాయింట్లస్థాయిని కోల్పోయి 10,063 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 14 పాయింట్ల నష్టంతో 10,079 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ సూచీ ఆగస్టు 2న 10,138 పాయింట్ల రికార్డుస్థాయిని నమోదుచేసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 32,348 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 32,127 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు 28 పాయింట్ల లాభంతో 32,186 పాయింట్ల వద్ద ముగిసింది. గత నెలలో సెన్సెక్స్ సృష్టించిన కొత్త రికార్డుస్థాయి 32,686 పాయింట్లు. కొత్త రికార్డుస్థాయి సమీపానికి చేరగానే మార్కెట్ ఒడుదుడుకులకు లోనయ్యిందని, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
పెట్రో కంపెనీలు డౌన్...:ప్రపంచ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల భారాన్ని ఇకనుంచి వినియోగదారులకు మళ్లించకుండా, కంపెనీలే భరించాలంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు కొన్ని ఫైనాన్షియల్ చానళ్లలో వార్తలు వెలువడటంతో పెట్రో మార్కెటింగ్ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. షేర్లు 4–6 శాతం మధ్య పతనమయ్యాయి.
మాట్రిమోనీ ఐపీఓకు 4.4 రెట్లు సబ్స్క్రిప్షన్
ఆన్లైన్ వివాహవేదికను నిర్వహిస్తున్న మాట్రిమోనీ డాట్ కామ్ జారీచేసిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) 4.41 రెట్లు ఓవర్సబ్స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ ముగింపురోజైన బుధవారం రాత్రి 7.15 సమయానికి ఎన్ఎస్ఈ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం ప్రకారం 1.24 కోట్ల షేర్లకు బిడ్స్ అందాయి. రూ. 983–985 ప్రైస్బ్యాండ్తో 28 లక్షల షేర్లను కంపెనీ ఆఫర్ చేస్తున్నది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లకు 17.99 రెట్లు బిడ్స్ వచ్చాయి.
సెన్సెక్స్ ప్లస్.. నిఫ్టీ మైనస్
Published Thu, Sep 14 2017 12:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
Advertisement