తెలంగాణలో ఏర్పాటుకు ప్రతిపాదన
నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ను ప్రోత్సహించేందుకు తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను తెలంగాణలో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ‘రక్షణ, అంతరిక్ష రంగానికి అవసరమైన పరికరాల తయారీలో ప్రముఖ కేంద్రంగా రూపొందేందుకు తెలంగాణలో అన్ని వసతులు, మానవ వనరులు ఉన్నాయి. అందుకే ఈ సెంటర్ను ఇక్కడ నెలకొల్పాలని కేంద్రానికి ప్రతిపాదించాం’ అని నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్ సోమవారం వెల్లడించారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న డిఫెన్స్, ఏరోసప్లై సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాలింగ్(ఎంఆర్వో) రంగంలో లాభదాయకత తగ్గిందని సారస్వత్ చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో విడిభాగాలపైన అధిక వ్యాట్తోపాటు ఇతర పన్నుల మూలంగా విమానయాన సంస్థలు సర్వీసింగ్ కోసం సింగపూర్, అబుదాబి వంటి దేశాలకు వెళ్తున్నాయని వెల్లడించారు. దేశంలో వడ్డీ రేట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయంటూ... ఇటువంటి అడ్డంకులను తొలగించినప్పుడే ఈ రంగం బలపడుతుందని చెప్పారు. భారత ఎంఆర్వో రంగం 2020 నాటికి రూ.16,900 కోట్లకు చేరుకుంటుందని ఆయన వెల్లడించారు.
ఐదేళ్లలో రూ.13 వేల కోట్లు..
వైమానిక, రక్షణ ప్రాజెక్టులకై భారతీయ కంపెనీల నుంచి విడిభాగాలను ఎయిర్బస్ కొనుగోలు చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో దేశం నుంచి రూ.13,000 కోట్ల విలువైన విడిభాగాలను సమీకరించాలన్నది గ్రూప్ లక్ష్యమని ఎయిర్బస్ డిఫెన్స్, స్పేస్ ఇండియా హెడ్ వెంకట్ కట్కూరి వెల్లడించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 వేల మందికి ఎయిర్బస్ ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. భారత్లో అవకాశాలతో పాటు అడ్డంకులూ ఉన్నాయన్నారు. కాగా, కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాజీవ్ శర్మ పాల్గొని మాట్లాడారు.
స్మార్ట్ తయారీకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
Published Tue, Dec 1 2015 2:05 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement