న్యూఢిల్లీ: భారత్లో ఆన్లైన్ కొనుగోళ్లు దూసుకెళ్తున్నాయని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పేర్కొంది. రెండేళ్లలో(2016 కల్లా) ఈ-కామర్స్ మార్కెట్ 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.93 వేల కోట్లు)కు ఎగబాకనున్నట్లు తెలిపింది. ప్రధానంగా ఇంటర్నెట్ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటం.. ఆన్లైన్లో షాపింగ్కు మొగ్గుచూపుతున్నవాళ్ల సంఖ్య జోరందుకుంటుండటమే దీనికి కారణమని వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్ మార్కెట్ విలువ 3 బిలియన్ డాలర్లు(సుమారు రూ.18,600 కోట్లు)గా పరిశ్రమ విశ్లేషకుల అంచనా. 2012లో ఆన్లైన్ కొనుగోలుదారుల సంఖ్య 80 లక్షలు కాగా, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 3.5 కోట్లకు పెరిగిందని గూగుల్ పేర్కొంది.
దుస్తులు, పాదరక్షల నుంచి ఎలక్ట్రానిక్స్, సౌందర్య ఉత్పత్తులు, ఫర్నిచర్ ఇలా సమస్తం ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్న ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది. కాగా, 2016నాటికి ఆన్లైన్ షాపర్ల సంఖ్య మూడింతలై 10 కోట్లకు వృద్ధి చెందనుందనేది గూగుల్ అంచనా. కన్సల్టింగ్ సంస్థ ఫారెస్టర్ నిర్వహించిన అధ్యయనం ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. సర్వేలో 6,859 మంది పాల్గొన్నారు.
ఆన్లైన్పై పెరుగుతున్న విశ్వాసం...
‘వచ్చే రెండేళ్లలో మూడింతలు కానున్న ఆన్లైన్ కొనుగోలుదార్లలో 5 కోట్ల మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచే జతకానున్నారు. ఈ నగరాల్లోని ఆఫ్లైన్ కొనుగోలుదారుల్లో(అధ్యయనంలో పాల్గొన్నవాళ్లు) 71 శాతం మంది రానున్న 12 నెలల్లో తాము ఆన్లైన్లో కొనుగోలు చేస్తామంటున్నారు. ఆన్లైన్ షాపింగ్ విషయంలో కస్టమర్ల విశ్వాసం పుంజుకుంటోందనడానికి ఇదే నిదర్శనం. ఈ డిసెంబర్ చివరినాటికి భారత్లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30.2 కోట్లుగా ఉండొచ్చని అంచనా.
తద్వారా ఆన్లైన్ యూజర్బేస్ విషయంలో అమెరికాను వెనక్కినెట్టి భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించనుంది’ అని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనంద్ పేర్కొన్నారు. ఆన్లైన్ షాపింగ్పై విశ్వాసం, పెరుగుతున్న యూజర్లతో ఈ-కామర్స్ రంగం ఊహించని వృద్ధిని సాధించనుందన్న సంకేతాలు న్నాయని గూగుల్ ఇండియా డెరైక్టర్నితిన్ బావంకులే అన్నారు. పటిష్టమైన వృద్ధి ధోరణికి అనుగుణంగా యూజర్ల అవసరాలను తీర్చడంపై పరిశ్రమ దృష్టిపెట్టాలన్నారు.
ఆన్లైన్ షాపింగ్ హల్చల్..!
Published Fri, Nov 21 2014 12:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement