♦ ఆగస్టు తర్వాతి నుంచి అమ్మకాల జోష్
♦ గతేడాది స్థాయిలోనే దేశీ మార్కెట్
♦ కంపెనీ సేల్స్ డెరైక్టర్ రానా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాక్టర్ల తయారీలో ఉన్న సోనాలికా 250 హెచ్పీ సామర్థ్యం గల మోడల్ను అభివృద్ధి చేస్తోంది. ఈ ఏడాదే దీనిని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ మార్కెట్ కోసం ఈ మోడల్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ 20-120 హెచ్పీ విభాగంలో ట్రాక్టర్లను దేశీయంగా విక్రయిస్తోంది.
మరింత అధిక సామర్థ్యమున్న మోడళ్లను భారత్లో ప్రవేశపెడతామని సోనాలికా ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ సేల్స్, మార్కెటింగ్ డెరైక్టర్ డి.ఎల్.రానా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మోడళ్లకు రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. 2015-16లో కొత్తగా 3 ట్రాక్టర్లను ప్రవేశపెట్టామన్నారు. మార్చికల్లా మరో 2 రానున్నాయని వివరించారు.
ఈ ఏడాది ఆగస్టు నుంచి..
దేశీయంగా ట్రాక్టర్ల మార్కెట్లో 2013-14లో 6.34 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. 2014-15 వచ్చేసరికి ఈ సంఖ్య 5.50 లక్షలకు పడిపోయింది. 2015-16 సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 3.89 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం వంటి కారణాలతో రైతులు కొత్త ట్రాక్టర్ల కొనుగోలుకు దూరంగా ఉన్నారని కంపెనీ తెలిపింది. మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15 స్థాయిలోనే ఉంటుందని సోనాలికా అంచనా వేస్తోంది. ఆగస్టు తర్వాతి నుంచి తిరిగి అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నామని రానా చెప్పారు. సోనాలికా 2014-15లో దేశవ్యాప్తంగా 66 వేల యూనిట్లను అమ్మింది.
15 శాతం వాటా లక్ష్యం..
ట్రాక్టర్ల తయారీలో దేశంలో మూడో స్థానంలో ఉన్న సోనాలికా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో 6.5 శాతం వాటా కలిగి ఉంది. ఈ రాష్ట్రాల్లో 2017 మార్చినాటికి 15 శాతం వాటా లక్ష్యంగా చేసుకుంది. పరిశోధన, అభివృద్ధికి ఏటా రూ.25 కోట్లు వెచ్చిస్తోంది. రూ.500 కోట్లతో 2 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో కంపెనీ కొత్తగా పంజాబ్లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటులో ఉత్పత్తి మరో 3 నెలల్లో ప్రారంభం కానుందని సీనియర్ జీఎం ఎన్వీఎల్ఎన్ స్వామి తెలిపారు. నాలుగేళ్ల క్రితం దేశీయ మార్కెట్లో 8 శాతంగా ఉన్న సోనాలికా వాటా ప్రస్తుతం 12 శాతానికి ఎగబాకింది.
సోనాలికా 250 హెచ్పీ ట్రాక్టర్ త్వరలో!
Published Sat, Jan 23 2016 1:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement