న్యూఢిల్లీ: బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్జెట్... చౌక చార్జీల పోరుకు మరోమారు తెరతీసింది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30లోగా ప్రయాణించే వారికి సూపర్ సమ్మర్ సేల్ పేరిట బేస్ చార్జీలో 35 నుంచి 75 శాతం డిస్కౌంట్ను సోమవారం ప్రకటించింది. ఆ వెంటనే... గోఎయిర్, ఇండిగో సంస్థలు కూడా చార్జీల తగ్గింపును ప్రకటించాయి. స్పైస్జెట్ చార్జీలను తగ్గించడం నెల రోజుల్లో ఇది మూడోసారి. సంక్రాంతి తర్వాత తొలుత 50 శాతం, ఆ తర్వాత 30 శాతం డిస్కౌంటును స్పైస్జెట్ ప్రకటించింది. దీంతో మిగిలిన కంపెనీలూ అదే బాట పట్టాయి. రెండు ఆఫర్లూ ఘనవిజయం సాధించడంతో సూపర్ సమ్మర్ సేల్ను స్పైస్జెట్ చేపట్టింది.
ఖాళీగా మిగిలే సీట్లు భర్తీ చేయడానికి ఈ తగ్గింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ టికెట్లను బుధవారం అర్ధరాత్రి వరకూ విక్రయిస్తామని స్పైస్జెట్ సీఓఓ సంజీవ్ కపూర్ తెలిపారు. గోవా, కేరళ వంటి పర్యాటక కేంద్రాలకు టికెట్ల డిమాండ్ ఇప్పటికే పెరుగుతోందన్నారు. చార్జీల్లో రాయితీని ప్రకటించగానే స్పైస్జెట్ టికెట్ల బుకింగ్ రెండు రెట్లకు పైగా పెరిగిందని ట్రావెల్ పోర్టల్ యాత్రా.కామ్ ప్రెసిడెంట్ శరత్ ధాల్ తెలిపారు. కళానిధి మారన్కు చెందిన స్పైస్జెట్ కొంతకాలంగా నిధుల కొరతతో సతమతమవుతోంది. డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.172 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది.
గోఎయిర్... 70 శాతం తగ్గింపు
స్పైస్జెట్ ప్రకటన వెలువడిన కాసేపటికే గోఎయిర్ సంస్థ కూడా 70 శాతం డిస్కౌంటును ప్రకటించింది. మూడు రోజులపాటు, అంటే బుధవారంలోగా కొనుగోలుచేసే టికెట్లపై ఈ తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఇండిగో కూడా కొన్ని సెక్టార్లలో ప్రయాణ చార్జీలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
స్పైస్జెట్ ఆఫర్...సూపర్ సమ్మర్ సేల్
Published Tue, Feb 25 2014 12:46 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement