బ్యాంక్, వాహన, లోహ షేర్ల దన్నుతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఆసియా మార్కెట్ల లాభాల జోరు సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 125 పాయింట్లు పెరిగి 37,271 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 33 పాయింట్లు లాభపడి 11,036 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా మూడో రోజుల పాటు లాభపడగా, నిఫ్టీ వరుసగా ఐదో రోజూ లాభపడింది. ముడి చమురు ధరలు 0.8% పెరగడం,రూపాయి మారకం విలువ 2 పైసలే పుంజుకోవడం, ట్రేడింగ్ చివర్లో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ జరగడం వల్ల లాభాలు పరిమితమయ్యాయి. అన్ని రంగాల బీఎస్ఈ సూచీలు లాభాల్లోనే ముగిశాయి.
రోజంతా లాభాలే..: మొహర్రం సందర్భంగా మంగళవారం సెలవు కావడంతో ఒక రోజు విరామం తర్వాత స్టాక్ మార్కెట్ లాభాల్లో ఆరంభమయ్యాయి. ఆరి్థక మందగమనాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనున్నదనే అంచనాలతో రోజంతా లాభాలు కొనసాగాయి. మరోవైపు వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య ఒప్పందం కుదరగలదన్న ఆశలతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం కలసివచి్చంది. ఆంక్షల విధింపు నుంచి 16 కేటగిరీల వస్తువులను చైనా మినహాయించడం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్కు జోష్నిచి్చంది.
వాహన షేర్ల జోరు: వాహనాలపై జీఎస్టీని కేంద్రం తగ్గించగలదన్న అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి. వాహన కంపెనీలు వాహనాల తయారీకి స్టీల్, అల్యూమినియమ్ లోహాలను ఉపయోగిస్తాయి కాబట్టి, లోహ షేర్లు కూడా మెరిశాయి. ఐషర్ మోటార్స్ 5%, మారుతీ సుజుకీ 4%, మదర్సన్ సుమి 4%, టీవీస్మోటార్ 3.6% మేర పెరిగాయి.
యస్ బ్యాంక్: పేటీఎంకు ప్రమోటర్ రాణాకపూర్ వాటా విక్రయం వార్తలతో షేర్ ఇంట్రాడేలో 16 శాతం పెరిగింది. చివరకు 13 శాతం లాభంతో రూ.71.60 వద్ద ముగిసింది.
ఈ నెలలో ఎఫ్పీఐల తొలి కొనుగోళ్లు
సూపర్ రిచ్ సర్చార్జీ తొలగించినప్పటికీ,మార్కెట్లో అమ్మకాలు ఆపని విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో తొలిసారి నికర కొనుగోలుదారులుగా నిలిచారు. బుధవారం రూ.267 కోట్ల నికర కొనుగోలు జరిపారు. ఈ నెలారంభంలో రూ.2,016 కోట్లుగా ఉన్న వీరి నికర అమ్మకాలు 9వ తేదీ నాటికి రూ.188 కోట్లకు తగ్గాయి.
ఐదో రోజూ నిఫ్టీకి లాభాలు
Published Thu, Sep 12 2019 2:04 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వేలుకు సిరాచుక్క
ఎమ్మెల్యేలకు పరీక్ష!
గీతకార్మికుడికి గాయాలు
ప్రశాంత పోలింగ్కు పటిష్ట బందోబస్తు
పార్లమెంటు ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● మూడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ ● సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ● పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్
ఓటెత్తాలి..!
ఎన్నికల విధుల్లో ఎన్సీసీ కేడెట్లు
ఎన్నికల విధుల్లో.. ఎస్సై సోదరులు
మండుటెండల్లో గాలివాన బీభత్సం
తప్పక చదవండి
- పోటెత్తిన ఓటర్లు
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement