సాక్షి,ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా మొదలయ్యాయి. కానీ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా రెండోరోజు కూడా కీలక సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటు న్నాయి. దీంతో సెన్సెక్స్ 104 పాయింట్లు క్షీణించి 35,789 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు బలహీనపడి 10,759 వద్ద10800 కి దిగువన మొదలయ్యాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో షేర్లు నష్టపోతున్నాయి
మెర్జర్లో వాటాల రేషియోకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడంతో బీవోబీ బాగా లాభపడుతోంది. అటు దెనా, విజయా బ్యాంకు నష్టాల్లో ఉన్నాయి. ఐషర్, హిందుస్తాన్ పెట్రోలు, బీపీసీఎల్, ఓన్జీసీ, ఐవోసీ, ఓరియంటల్, జెట్ ఎయిర్వేస్ భారతి ఎయిరటెల్ నష్టపోతున్నాయి. అయితే ఐసీఐసీఐ, టీవీఎస్మోటార్, హెక్సావేర్, ఇన్ఫోసిస్, లాభపడుతున్నాయి.
మరోవైపు డాలరు మారకంలో రుపీ బలహీనత కొనసాగుతోంది. గురువారం ఆరంభంలోనే రూపాయి 12పైసలు క్షీణించి 70.29వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. దీంతో రూపాయి రెండు వారాల కనిష్టాన్ని తాకింది.