దేశీ స్టాక్మార్కెట్లు పటిష్టంగా ముగిశాయి. వారంతంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో లాభాలతో ముగిశాయి. మిశ్రమ ప్రపంచ సంకేతాలతో సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి160 పాయింట్లు పెరిగి 38,767 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు ఎగసి 11,643 వద్ద ముగిసింది.
అన్ని రంగాలూ లాభపడగా ప్రధానంగా మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో, పీఎస్యూ బ్యాంక్స్ లాభపడ్డాయి. ఐటీసీ, గెయిల్, మారుతీ, జీ, సిప్లా, అదానీ పోర్ట్స్, వేదాంతా, ఐషర్, యాక్సిస్, బ్రిటానియా టాప్విన్నర్స్గా నిలవగా, ఐబీ హౌసింగ్, ఐవోసీ, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, టైటన్, హిందాల్కో, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ టాప్ లూజర్స్గా నిలిచాయి.