డైరెక్టర్ పదవినుంచి తొలగింపు
• ఈజీఎమ్లో తీర్మానాన్ని ఆమోదించిన వాటాదారులు
• టాటా గ్రూప్తో తెగిన చివరి అనుబంధం
ముంబై: టాటా గ్రూప్తో సైరస్ మిస్త్రీకి మిగిలిన చివరి అనుబంధం(హోదా పరంగా) తెగిపోయింది. టాటా సన్స్ డైరెక్టర్గా మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి కంపెనీ వాటాదారులు ఆమోదం తెలిపారు. సోమవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్)లో డైరెక్టర్గా సైరస్ మిస్త్రీని తొలగించాలన్న తీర్మానానికి వాటాదారులు తగిన మెజారిటీతో ఆమోదం తెలిపారని టాటా సన్స్ పేర్కొంది. ఈ పరిణామం కారణంగా టాటా సన్స్ కంపెనీలో 18.5 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబానికి పదేళ్ల తర్వాత తొలిసారిగా ఆ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
షాపూర్జీ పల్లోంజీ కుటుంబం ఈ కంపెనీలో 1965 నుంచి వాటాదారుగా ఉంది.1980లో మిస్త్రీ తండ్రి పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ డైరెక్టర్గా చేరారు. 2004లో వైదొలిగారు. రెండేళ్ల తర్వాత 2006లో సైరస్ మిస్త్రీ డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన టాటా సన్స్ చైర్మన్ అయ్యారు. పనితీరు బాగా లేదంటూ చైర్మన్ పదవి నుంచి ఆయనను టాటా సన్స్ కంపెనీ గత ఏడాది అక్టోబర్ 24న తొలగించింది. తదనంతరం టాటా మోటార్స్, టీసీఎస్ తదితర ఆరు టాటా గ్రూప్ కంపెనీలు ఆయనను డైరెక్టర్గా తమ తమ డైరెక్టర్ల బోర్డ్ నుంచి తొలగించాయి.
విఫలమైన మిస్త్రీ ప్రయత్నాలు
డైరెక్టర్గా మిస్త్రీని తొలగించడానికి అసాధారణ సర్వసభ్య సమావేశం(ఈజీఎమ్) నిర్వహించనున్నామని గత నెలలోనే టాటా సన్స్ ప్రకటించింది. దీనిని న్యాయపరంగా అడ్డుకోవడానికి మిస్త్రీ చేసిన పలు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈజీఎమ్ నిర్వహణను అడ్డుకోవాలంటూ మిస్త్రీ వేసిన పిటీషన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ గత నెల 31న కొట్టేసింది. ఈ ఈజీఎమ్కు వ్యతిరేకంగా మిస్త్రీకి చెందిన రెండు ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు దాఖలు చేసిన పిటీషన్లను గత వారంలో నేషనల్ కంపెనీ లా అప్పిల్లేట్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది. దీంతో ఈజీఎమ్కు మార్గం సుగమం అయింది. ఈ ఈజీఎమ్లో డైరెక్టర్గా ఆయనను తొలగించే తీర్మానం ఆమోదం పొందింది.
టాటా సన్స్ నుంచి సైరస్ మిస్త్రీ ఔట్
Published Tue, Feb 7 2017 12:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement