హైదరాబాద్: ఎండ్ టు ఎండ్ ఐటీ సేవలందించే టెక్వేవ్ కన్సల్టింగ్ కంపెనీ విస్తరిస్తోంది. ఇంగ్లాండ్కు చెందిన టెక్ అద్వైత కంపెనీని, హంగరీకు చెందిన సాప్ కంపెనీని కొనుగోలు చేసినట్లు టెక్వేవ్ కన్సల్టింగ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రెండు కంపెనీలను రూ.25 కోట్లతో కొనుగోలు చేశామని టెక్వేవ్ సీఈఓ దామోదర్ రావు గుమ్మడపు పేర్కొన్నారు.
నెదర్లాండ్స్లో డెలివరీ సెంటర్ను ఏర్పాటు చేశామని, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో కార్యాలయాలను ప్రారంభించామని తెలిపారు, గత ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల ఆదాయం సాధించామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో పది కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అమెరికాలోని ఎక్స్టన్(పెన్సిల్వేనియా) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి హైదరాబాద్లో గ్లోబల్ డెలివరీ సెంటర్ ఉంది.