వాషింగ్టన్: చైనా ఉత్పత్తులపై ఏకపక్షంగా భారీ టారిఫ్లు విధించడాన్ని అమెరికా సమర్థించుకుంది. చైనాతో వాణిజ్యలోటు వల్ల అమెరికాలో 20 లక్షల ఉద్యోగాలను కోల్పోయినట్టు వైట్హౌస్ పేర్కొంది. ‘‘అమెరికా అనైతిక వాణిజ్య విధానాల వల్ల ఆ దేశంతో వాణిజ్య లోటు 370 బిలియన్ డాలర్లకు చేరింది. మార్కెట్ వక్రీకరణ విధానాల కారణంగా ఏర్పడే ప్రతి బిలియన్ డాలర్ వాణిజ్య లోటు వల్ల మా వద్ద 6,000 ఉద్యోగాలకు నష్టం వాటిల్లింది. సంప్రదాయ లెక్కల మేరకు వాణిజ్య లోటు ఫలితంగా 20 లక్షల అదనపు ఉద్యోగాలు చైనాలో సమకూరగా, మా దగ్గర అంతే మొత్తం తగ్గాయి. ఇది తీవ్రమైన సమస్య’’ అని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. ఇక ఏ విధంగా స్పందించాలనేది చైనా ఇష్టమని వ్యాఖ్యానించారు. వాణిజ్య బంధం ద్వారా అమెరికా కంటే చైనాయే ఎక్కువగా లబ్ధి పొందిందన్నారు. చైనా ఆర్థిక విధానాలపై అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. తమ వాణిజ్య భాగస్వామ్య దేశాలు చాలా వరకు ఇవే ఆందోళన వ్యక్తం చేశాయని అధ్యక్ష కార్యాలయం అధికారి చెప్పారు. కాగా ట్రంప్ సర్కారు చర్యలను సెనేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు రాన్వైడన్, సెనేటర్ షెరాడ్బ్రోన్ స్వాగతించారు.
ఏకపక్ష చర్యలు వద్దు: అమెరికా కంపెనీలు
అయితే, ఏకపక్ష చర్యలు సమస్యకు పరిష్కారం కాదని అమెరికాలోని ప్రముఖ కంపెనీల సీఈవోల సంఘం ‘బిజినెస్ రౌండ్టేబుల్’ పేర్కొంది. చైనాలో సంస్కరణలు తెచ్చేలా దీర్ఘకాలిక వ్యూహం అమలు చేయకుండా ఏకపక్షంగా టారిఫ్ విధించడం లేదా ఇతర ఆంక్షలనేవి అమెరికాలో ధరల పెరుగుదలకు దారితీస్తాయని అభిప్రాయపడింది. దీనివల్ల అమెరికా కంపెనీలు, ఉత్పత్తులు పోటీ పడలేని పరిస్థితి ఏర్పడుతుందని, అమెరికా వినియోగదారులు, కార్మికులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
అమెరికా ఉత్పత్తులకూ చైనా అదేశిక్ష
అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 3 బిలియన్ డాలర్ల సరుకులపై అధిక టారిఫ్లు విధించనున్నట్టు చైనా ప్రకటించింది. దీన్ని అల్యూమినియం, ఉక్కు ఉత్పత్తులపై వేసిన టారిఫ్కు ప్రతిచర్యగా చైనా పేర్కొంది. వైన్, సీమ్లెస్ స్టీల్ ట్యూబులు, పంది మాంసం తదితర 128 ఉత్పత్తులపై పన్ను పెంపు ఉంటుందని చైనా వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. పండ్లు, వైన్, సీమ్లెస్ స్టీల్ ట్యూబులపై 15 శాతం పన్ను, పంది మాంసం, శుద్ధి చేసిన అల్యూమినియం ఉత్పత్తులపై 25 పన్ను విధించనున్నట్టు తెలిపింది. రెండు దశల్లో వీటిని అమలు చేస్తామని పేర్కొంది.
20 లక్షల ఉద్యోగాలను కోల్పోయాం
Published Sat, Mar 24 2018 1:08 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement