క్రికెట్ ఎంపికలకు విశేష స్పందన
కడప స్పోర్ట్స్ : కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ ఎంపికలకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది. సీనియర్స్, అండర్–23, అండర్–19 విభాగాల్లో నిర్వహించిన ఈ ఎంపికలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ జిల్లా కార్యదర్శి అవ్వారు రెడ్డిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులకు క్రమశిక్షణ, అంకితభావం అవసరం అన్నారు. ప్రతిరోజూ సాధన చేయడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరని సూచించారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులను తొలుత ప్రాబుబుల్స్కు ఎంపిక చేసి మ్యాచ్లు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. అనంతరం ఎంపికలు నిర్వహించి ప్రాబబుల్స్కు ఎంపిక చేశారు. సీనియర్ విభాగంలో 50 మందికి గాను 32 మందిని, అండర్–23 విభాగంలో 70 మందికి గాను 42 మందిని, అండర్–19 విభాగంలో 120 మందికి గాను 60 మందిన ప్రాబబుల్స్కు ఎంపిక చేసినట్లు సెలెక్టర్లు తెలిపారు. ఎంపికలను సెలెక్టర్లు నజీర్ అహ్మద్, అబ్దుల్ ఫరూఖ్ రెహమాన్, శివప్రసాద్, ఆనంద్కుమార్, పైడికాల్వ విజయ్కుమార్, మణికుమార్రెడ్డి, విష్ణుప్రసాద్ పరిశీలించారు. కార్యక్రమంలో సీఏవైడీ సంయుక్త కార్యదర్శి ఎం. సాయిపృద్వితేజ్, సిరాజుద్దీన్ దౌలా, సంజయ్కుమార్రెడ్డి, మునికుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
240 మంది క్రీడాకారులు హాజరు
ప్రాబబుల్స్ ఎంపిక