అన్ని రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు
⇒ 27,491కు సెన్సెక్స్ సూచీ...
⇒ 150 పాయింట్ల లాభంతో 8,332కు నిఫ్టీ
⇒ మరికొన్నాళ్లు ఈ స్పీడ్: నిపుణులు
ముంబై: అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు పోటెత్తడంతో స్టాక్ మార్కెట్ సోమవారం భారీ లాభాల్లో ముగిసింది. ఏప్రిల్లో అమ్మకాలు జరిపిన ఇన్వెస్టర్లు మేలో తాజాగా పొజిషన్లు తీసుకోవడంతో స్టాక్ మార్కెట్ దూసుకుపోయింది. నిఫ్టీ 8,300 పాయింట్ల స్థాయి పైకి చేరింది. ఎఫ్ఐఐల మ్యాట్పై కొన్ని మినహాయింపులివ్వడం, ఆర్థిక బిల్లు ఆమోదం పొందడం, రిటైల్ రంగంలో రెండు భారీ విలీనాలు చోటు చేసుకోవడం మార్కెట్ సెంటిమెంట్ను మెరుగుపర్చింది. ఏప్రిల్లో వాహన విక్రయాలు అంచనాలను మించడంతో వాహన షేర్లు దూసుకుపోవడం సెంటిమెంట్కు మరింత జోష్నిచ్చింది. వాహన, రియల్టీ, రిఫైనరీ రంగాలకు చెందిన స్టాక్స్లో కొనుగోళ్ల జోరు కనిపించింది.
ఇదే అవకాశం...: గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో అమ్మకాల కారణంగా పలు షేర్లు తక్కువ స్థాయిల్లో లభ్యమవుతుండటంతో కొనుగోళ్లు పెరిగాయని నిపుణులంటున్నారు. సెక్యూరిటీల విక్రయం, రాయల్టీ, టెక్నికల్ సర్వీసుల ఫీజులు, వడ్డీ ఆదాయం.. వీటన్నింటి మూలధన లాభాలపై మ్యాట్ వర్తించదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టత ఇవ్వడం మార్కెట్ పెరుగుదలకు కారణమైందని ట్రేడర్లు పేర్కొన్నారు గత మూడు వారాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు దాదాపు 7 శాతం వరకూ నష్టపోయాయని, సోమవారం జరిగిన షార్ట్ కవరింగ్ కారణంగా ఈ సూచీలు దాదాపు 2 శాతం లాభపడ్డాయని నిపుణులంటున్నారు. ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ కొంత కాలం కొనసాగుతుందని వారంటున్నారు.
ఇదే జోరు రానున్న రోజుల్లో కూడా కొనసాగుతుందన్న అంచనాలున్నాయని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ చెప్పారు. సెన్సెక్స్ 27,205 పాయింట్లతో లాభాల్లోనే ప్రారంభమైంది. కొనుగోళ్లు జోరుగా ఉండటంతో 27,538 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 479 పాయింట్ల లాభంతో 27,491 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 8,346 పాయింట్ల గరిష్ట స్థాయికి ఎగసింది. చివరకు 150 పాయింట్ల లాభంతో 8,332 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీకి రెండు నెలల్లో ఇదే అత్యుత్తమ గరిష్ట స్థాయి.
టాప్గేర్లో రిటైల్, వాహన షేర్లు
రిటైల్ రంగంలో భారీ పరిణామాలు సంభవించాయి. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ భారతీ రిటైల్ను రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో ఫ్యూచర్ రిటైల్ 12 శాతం ఎగసి రూ.129 వద్ద ముగిసింది. రిటైల్ వ్యాపారాన్ని ఏకీకృతం చేయాలనుకున్న ఆదిత్య బిర్లా గ్రూప్ యోచనకు స్టాక్ మార్కెట్ సై అంది. దీంతో పాంటలూన్ ఫ్యాషన్ 20 శాతం అప్పర్ సీలింగ్తో రూ. 138 వద్ద ముగిసింది. ఆదిత్య బిర్లా నువో 12.6 శాతం లాభపడి రూ.1,764 వద్ద ముగిసింది. వాహన విక్రయాలు ఏప్రిల్ నెలలో అంచనాలను మించడంతో వాహన షేర్లు పరుగులు పెట్టాయి. బజాజ్ ఆటో 7.4 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 4.7 శాతం, టీవీఎస్ మోటార్ 6 శాతం, హీరో మోటోకార్ప్ 2.4 శాతం చొప్పున పెరిగాయి.
30కి 27 షేర్లు లాభాల్లోనే
30 సెన్సెక్స్ షేర్లలో 27 షేర్లు లాభాల్లోనే ముగిశాయి. ఓఎన్జీసీ 7.5 శాతం, సిప్లా 5.8 శాతం, భెల్ 3.2 శాతం, హిందాల్కో 3.2 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.2 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.9 శాతం, హెచ్డీఎఫ్సీ 2.8 శాతం, ఎస్బీఐ 2.6 శాతం, డాక్టర్ రెడ్డీస్ 2.6 శాతం, ఇన్ఫోసిస్ 2.6 శాతం, హీరో మోటోకార్ప్ 2.4 శాతం, చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.61 కోట్లు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.147 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
సెన్సెక్స్ 479 పాయింట్లు అప్
Published Tue, May 5 2015 1:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement