Sakshi News home page

ట్రూజెట్ 3 కొత్త విమాన సర్వీసులు

Published Mon, May 2 2016 12:40 AM

ట్రూజెట్ 3 కొత్త విమాన సర్వీసులు

సాక్షి, తిరుపతి: విజయవాడ-కడప, విజయవాడ-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్ మార్గాల్లో మంగళవారం నుంచి ట్రూజెట్ పేరుతో టర్బో మేఘా విమానయాన సేవలు అందిస్తున్నట్లు ఆసంస్థ ఎండీ వి.ఉమేష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సర్వీస్ కింద తిరుపతి-హైదరాబాద్ మార్గంలో ప్రతిరోజూ తిరుపతిలో 9.45కు బయలుదేరి 11 గంటలకు హైదరాబాద్ చేరుకుటుందని చెప్పారు. రెండో సర్వీస్  తిరుపతి-హైదరాబాద్ మార్గంలో సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి 2.05కు చేరుతుందని, 3వ సర్వీస్ తిరుపతి-హైదరాబాద్ మార్గంలో మంగళ, బుధ గురువారాల్లో సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి 7.35కు చేరుతుందని చెప్పారు.

4వ సర్వీస్ తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ రాత్రి 8.20కి బయలుదేరి 9.45కు హైదరాబాద్‌కు చేరుతుందన్నారు. తిరుపతి-గోవా మార్గంలో శుక్ర ,శని, ఆది, సోమవారం మధ్యాహ్నం 12.45కు తిరుపతిలో బయలుదేరి సాయంత్రం 4.45కు గోవా చేరుతుందన్నారు. విజయవాడ-తిరుపతి మార్గంలో మంగళ, బుధ, గురవారాల్లో సాయంత్రం 4.35కు విజయవాడలో బయలుదేరి 5.50కి తిరుపతికి చేరుతుందన్నారు. కడప-తిరుపతి మార్గంలో సోమ, శుక్ర, శని, ఆదివారాల్లో ఉదయం 11.35కు కడపలో బయలుదేరి 12.20కి తిరుపతికి చేరుతుందన్నారు.

Advertisement
Advertisement