ఉదయం 8 గం.కి తిరుపతి నుంచి రాజమండ్రికి తొలి విమానం
- హైదరాబాద్, చెన్నై నుంచి కూడా పుష్కరాలకు విమానాలు
- 26 నుంచి పూర్తిస్థాయి సర్వీసులు; ఆరంభ ఆఫర్ ధర రూ.1,499
- ఈ ఏడాది చివరికి 5 విమానాలు; ఐదేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడి
- కంపెనీ డెరైక్టర్, హీరో రామ్చరణ్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో విమానయాన సంస్థ ఆరంభమైంది. ‘ట్రూజెఃట్’ పేరిట ఆదివారం నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు ‘టర్బో మేఘ ఎయిర్వేస్’ ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పూర్తిస్థాయి సేవలు ప్రారంభించనున్న ఈ సంస్థ... గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఆదివారం నుంచి హైదరాబాద్, తిరుపతి, చెన్నైల నుంచి రాజమండ్రికి ప్రత్యేక విమానాలు నడుపుతోంది.
దీనికోసం హైదరాబాద్-రాజమండ్రి మధ్య రూ.1499 ధరను ప్రారంభ ఆఫర్గా ప్రకటించింది. ఆదివారం ఉదయం 8 గంటలకు తొలి విమానం తిరుపతిలో బయలుదేరుతుందని శుక్రవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో టర్బో మేఘ డెరైక్టరు, సినీ హీరో రామ్చరణ్ ప్రకటించారు. ఈ నెల 26 నుంచి హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-అహ్మదాబాద్, హైదరాబాద్-రాజమండ్రి మధ్య కూడా సర్వీసులుంటాయని ఆయన తెలిపారు. ఏడాదిన్నర నుంచి ప్రయత్నాలు చేస్తుండగా అన్ని అనుమతులూ వచ్చేసరికి ఇంత సమయం పట్టిందని, తాను బ్రాండ్ డెరైక్టర్, బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నానని చెప్పారాయన. ‘‘విమాన ప్రయాణాల్లో కావాల్సినవి సౌకర్యం, సమయానికి చేరటం, సేవలు, ఆతిథ్యం, మంచి ఫుడ్. అవన్నీ మేం ఏ విమానయాన సంస్థకూ తక్కువ కాకుండా అందిస్తాం’’ అని ఆయన వివరించారు.
వినూత్న సేవలు; డిస్కౌంట్లు
ఈ రంగంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా వృద్ధులు, విద్యార్థులు, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందినవారు, జర్నలిస్టులకు టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు రామ్చరణ్ తెలియజేశారు. దీంతోపాటు సమీప ప్రాంతాల నుంచి ప్రయాణికుల్ని ఉచితంగా ఎయిర్పోర్టుకు చేర్చే బాధ్యతను కూడా తీసుకుంటున్నామంటూ... ఉదాహరణకు నెల్లూరు, చిత్తూరుల నుంచి తిరుపతి విమానాశ్రయానికి... షిర్డీ నుంచి ఔరంగాబాద్ విమానాశ్రయానికి తామే తీసుకెళతామని సంస్థ ఎండీ ఉమేష్ వంకాయలపాటి తెలియజేశారు.
రెండు విమానాలతో మొదలు
సంస్థ ప్రస్తుతం రెండు విమానాలను కొనుగోలు చేసింది. ఈ రెండూ 72 సీటర్ల ఏటీఆర్-500 విమానాలే. ఈ ఏడాది చివరికి వీటి సంఖ్య ఐదుకు చేరుస్తామని, దీనికోసం రూ.120-150 కోట్ల మధ్య పెట్టుబడి అవసరమవుతుందని తాము అంచనా వేస్తున్నామని ఉమేష్ చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో దీనిపై రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలియజేశారు. శంషాబాద్లోని జీఎంఆర్ ఏరో పార్క్లో... విమాన పరికరాల కోసం నిర్వహణ, మరమ్మతు, ఓవర్హాల్ (ఎంఆర్ఓ) యూనిట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని, రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఈ యూనిట్ అన్ని అనుమతులూ వస్తే ఈ ఏడాది చివరికల్లా కార్యకలాపాలు ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. ట్రూజెట్ ద్వారా ఈ ఏడాది చివరినాటికి 70-80% లోడ్ ఫ్యాక్టర్ను సాధిస్తామనే విశ్వాసం కూడా ఆయన వ్యక్తంచేశారు. సెప్టెంబర్ నాటికి మరో 7 ప్రాంతాలకు సేవలందిస్తామని, విశాఖ కూడా ఇందులో ఉండవచ్చని చెప్పారాయన. ప్రస్తుతం తమకు 200 మంది వరకూ సిబ్బంది ఉన్నట్లు చెప్పారు.
రేపటి నుంచి ట్రూజెట్ సేవలు
Published Fri, Jul 10 2015 11:47 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement