* అమెరికా వాణిజ్య మంత్రి ప్రిట్జ్కెర్
* నేటి నుంచి భారత్లో పర్యటన
వాషింగ్టన్: భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే విషయంలో అమెరికా సానుకూలతతో ఉంది. ద్వైపాక్షిక వాణిజ్యం 109 బిలియన్ డాలర్లకు చేరుకుందని, జీఎస్టీ వంటి నూతన సంస్కరణలతో ఇది మరింత విస్తృతం అవుతుందని అమెరికా ఆదివారం ప్రకటించింది. అమెరికా వాణి జ్య మంత్రి పెన్నీ ప్రిట్జ్కెర్ 3 రోజుల భారత పర్యటన సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పర్యాటకం, ప్రాం తీయ ఒప్పందాలు అనేవి 2017లో రెండు దేశాల మధ్య వాణిజ్య సహకార విస్తృతికి దృష్టి సారించాల్సిన అంశాలుగా గుర్తించినట్టు ఆమె తెలిపారు.
పదేళ్లలో మూడు రెట్ల వృద్ధి
‘అమెరికా - భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 2005లో 37 బిలియన్ డాలర్లుగా ఉంటే, 2015లో 109 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2015లో భారత్లో అమెరికా కంపెనీలు 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడితే... అమెరికాలో భారత కంపెనీలు 11 బిలియన్ డాలర్లు వెచ్చించాయి. అమెరికాలోని భారత అనుబంధ కంపెనీలు 52వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పిస్తున్నాయి’ అని ప్రిట్జ్కెర్ గణాంకాలను వెల్లడించారు. ఇరుదేశాలు పరస్పరం కలసి సాధిం చేందుకు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.
భారత్ చర్యల్ని స్వాగతిస్తున్నాం...
వ్యాపార వాతావరణాన్ని మెరుగు పరిచే విషయంలో భారత్ చర్యలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ, దివాళా చట్టాల ఆమోదం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని సరళతరం చేయడం వంటి మోదీ సర్కారు ప్రతిష్టాత్మక సంస్కరణల ఎజెండా కారణంగా... రానున్న కాలంలో ఆర్థిక సహాకారం మరింత బలోపేతం అవుతుందని ప్రిట్జ్కెర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ ఆమోదం అనేది చరిత్రాత్మక విజయంగా అభివర్ణించారు.
500 బిలియన్ డాలర్ల లక్ష్యం
ముంబై: అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమీప భవిష్యత్తులో 500 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని కేంద్రం విధించుకుంది. ప్రస్తుతం ఇది 109 బిలియన్ డాలర్లుగానే ఉంది. పీడబ్ల్యూసీ, అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) సంయుక్త నివేదిక ప్రకారం... ఎయిరోస్పేస్, రక్షణ, బ్యాకింగ్, ఆర్థిక సేవలు, బీమా, రసాయనాలు, సరుకు రవాణా, ఇంధన, మౌలిక రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని, దేశీయంగా వృద్ధి చెందడమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగానూ వ్యాపార కేంద్రంగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. అలాగే, పోర్టులు, ఆయిల్, గ్యాస్, ఫార్మా రంగాల్లోనూ అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది.
సంస్కరణలతో వాణిజ్య బంధానికి బూస్ట్
Published Mon, Aug 29 2016 1:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement