అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది నుంచి వడ్డీ రేట్లు పెంచే సంకేతాలివ్వడంతో గురువారం ప్రపంచ మార్కెట్ల ట్రెండ్కు అనుగుణంగా భారత్ సూచీలు క్షీణించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 93 పాయింట్ల క్షీణతతో రెండు వారాల కనిష్టస్థాయి 21,740 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 41 పాయింట్ల తగ్గుదలతో 6483 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఉద్దీపన ప్యాకేజీ ముగిసిన తర్వాత 6 నెలలకు వడ్డీ రేట్లు పెంచే అవకాశాలున్నాయని ఫెడ్ ఛైర్మన్ జనెత్ యెలెన్ ప్రకటించడంతో గత రాత్రి అమెరికా సూచీలు 0.75 శాతం తగ్గాయి. దాంతో గురువారం ఆసియా సూచీలు కూడా క్షీణించాయి.
అమెరికాలో రేట్ల పెంపు సంకేతాలతో విదేశీ ఇన్వెస్టర్లు కొంతమేర పెట్టుబడుల్ని వెనక్కు తీసుకోవచ్చన్న అంచనాలను మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దేశీ మార్కెట్లో రియల్టీ, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, పవర్ షేర్లు క్షీణించాయి. డీఎల్ఎఫ్ 3.5 శాతం తగ్గగా, హెచ్డీఎఫ్సీ, బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీలు 2-3 శాతం మధ్య పడిపోయాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐలు 1-2 శాతం మధ్య తగ్గాయి. రూపాయి మారకపు విలువ తగ్గిన ప్రభావంతో ఐటీ షేర్లు పెరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసీస్, విప్రోలు 1-3 శాతం మధ్య ఎగిసాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 722 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలుచేయగా, దేశీయ సంస్థలు రూ. 563 కోట్లు వెనక్కు తీసుకున్నాయి.
నిఫ్టీ 6,500 స్థాయిపై గురి...
మరో ఐదు ట్రేడింగ్ సెషన్లలో మార్చి డెరివేటివ్ కాంట్రాక్టులు ముగియనున్న సందర్భంగానే ఫెడ్ నిర్ణయం వెలువడటంతో 6,500 స్థాయి మీద అటు బుల్స్, ఇటు బేర్స్ గురిపెట్టారు. వీరి పోరును సూచిస్తూ ఈ స్ట్రయిక్ వద్ద భారీగా కాల్, పుట్ రైటింగ్ జరిగింది. కాల్ ఆప్షన్లో 10.24 లక్షల షేర్లు, పుట్ ఆప్షన్లో 5.51 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. రెండింటిలోనూ మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) సమంగా 56 లక్షల షేర్ల చొప్పున వుంది. నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి లాంగ్ ఆఫ్లోడింగ్ జరగడంతో 6.64 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓఐ 1.92 కోట్ల షేర్లకు తగ్గింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 24 పాయింట్ల నుంచి 19 పాయింట్లకు తగ్గింది. సమీప భవిష్యత్తులో 6,500 దిగువన నిఫ్టీ క్రమేపీ 6,400 స్థాయికి తగ్గవచ్చని, 6,500పైన స్థిరపడితేనే తిరిగి మార్కెట్ బలపడే అవకాశాలుంటాయని ఈ డేటా సూచిస్తున్నది.
ఫెడ్ ఎఫెక్ట్.. 2 వారాల కనిష్టం
Published Fri, Mar 21 2014 12:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement