సరికొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది | Sakshi
Sakshi News home page

సరికొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది

Published Mon, May 2 2016 7:03 PM

సరికొత్త స్మార్ట్ వాచ్ వచ్చేసింది

చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ షియోమి చిన్న పిల్లల కోసం సరికొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'మి బన్నీ' గా నామకరణం చేసిన ఈ స్మార్ట్ వాచ్ ఖరీదు 3 వేల రూపాయలని కంపెనీ వెల్లడించింది. మి.కామ్ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. చిన్న పిల్లల కోసం షియోమి నుంచి వచ్చిన మొదటి స్మార్ట్ వాచ్ ఇదేనని కంపెనీ తెలిపింది. తల్లిదండ్రులకు పిల్లల గురించి తెలుసుకునేలా ఈ వాచ్ ను రూపొందించారు. ఈ స్మార్ట్ వాచ్ జీపీఎస్ కనెక్టివిటీ, వైఫై కలిగి ఉండి, వాయిస్ కాల్స్ కు సపోర్టు చేస్తుంది. ఒక సిమ్ కూడా దీనిలో ఉంటుంది.

ఆరుగురు కుటుంబ సభ్యుల నెంబర్స్ కలిగి ఉండి, వారితో ఉచితంగా మాట్లాడగలిగే సదుపాయం ఉండటం ఈ వాచ్ లోని స్పెషల్ ఫీచర్. ఒకవేళ పిల్లలు పరిసర ప్రాంతాల్లో లేనిసమయంలో ఈ యాప్ ద్వారా వారితో మాట్లాడుకునే సౌకర్యం కూడా ఉంటుంది. సురక్షితమైన ప్రాంతాల్లో పిల్లలు ప్రయాణించేలా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ల ద్వారా వారిని మార్గనిర్దేశం చేసేలా దీన్ని రూపొందించారు. ఒకవేళ వారు దారితప్పినా తల్లిదండ్రులకు వెంటనే సందేశాలు వెళ్లే అవకాశం కల్పించారు. ఈ స్మార్ట్ వాచ్ వాటర్ ఫ్రూప్, 300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎల్ఈడీ డాట్ మ్యాట్రిక్స్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 4.2 దీనిలోని ఫీచర్స్. బ్లూ, పింక్ రంగులో ఈ స్మార్ట్ వాచ్ లు అందుబాటులో ఉన్నాయి.

Advertisement
Advertisement